ఆంధ్రప్రదేశ్‌లో గ్రామవాలంటీర్ పోస్టులకు మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 4 లక్షలకు పైగా గ్రామ/పట్టణ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి జూన్‌లో నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇకపోతే  జూన్ 24 నుంచి జులై 5 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. పట్టణ (వార్డు) వాలంటీర్ ఉద్యోగాలకు జులై 10 వరకు దరఖాస్తులు స్వీకరించారు. అనంతరం జులై 11 నుంచి 25 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఇంటర్వ్యూల ఆధారంగా ఎంపికైన అభ్యర్థుల మెరిట్ జాబితాను జిలాల్ల వారీగా విడుదల చేశారు.


ఎంపికైనవారిలో కొంత మంది నియామక పత్రాలు తీసుకోలేదు.. మరికొన్ని చోట్ల సరైన అభ్యర్థులు లేనికారణంగా మరోసారి నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దశలో గ్రామ వాలంటీర్ పోస్టుల ఖాళీల భర్తీపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు గతంలో నియామకాలు పూర్తికాగా.. మిగిలిపోయిన గ్రామ వాలంటీర్ పోస్టుల భర్తీకి మరోసారి నోటిఫికేషన్ జారీచేయనున్నారు. అదిగాక ఇదివరకు ఏపీలో 1,94,592 గ్రామ వాలంటీర్లను ప్రభుత్వం నియమించిన సంగతి తెలిసిందే. అయితే వారిలో 1,84,944 మంది మాత్రమే విధుల్లో చేరడంతో.. 9,648 ఖాళీలు ఏర్పాడ్డాయి.


ఈ పోస్టుల భర్తీకి వీలైనంత త్వరలో నోటిఫికేషన్ జారీచేసి నియామకాలు చేపట్టడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాల వారీగా ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలను ప్రభుత్వానికి నివేదించారు. దీనిప్రకారం మొత్తం 9,648 ఖాళీల్లో.. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 1,861 పోస్టులుండగా.. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 200 ఖాళీలు ఉన్నాయి. డిసెంబరులోగా నియామక ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం రాగానే నోటిఫికేషన్ వెలువడనుందని అధికారులు తెలిపారు..



మరింత సమాచారం తెలుసుకోండి: