వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చి ఏం చేస్తాడులే అని అనుకోని వారు లేరు...కాని ఇప్పుడు  ఐదు మాసాలు పాల‌న పూర్తి చేసుకున్న జ‌గ‌న్, నిరుపేదల‌కు, పేద‌ల‌కు సంబంధించిన, సంక్షేమ ప‌థ‌కాలు ఎన్నో అమ‌లు చేస్తున్నారు. ఇకపోతే చంద్రబాబు రూ. 65 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులు, వేల కోట్ల అప్పులతో ఖజానాను ఖాళీ చేసి వెళ్లిపోతే, జగన్ ఇచ్చిన మాట కోసం పేద ప్రజలకు అండగా నిలబడి ఎన్నో వరాలను ప్రకటిస్తున్నాడు. ఈ దశలో అగ్రిగోల్డ్‌ బాధితులకు కూడా ఊహించని అవకాశాన్ని సహాయం రూపంగా అందించడానికి సిద్దమైయ్యాడు..


దేశంలో జనం బలహీనతలు సొమ్ము చేసుకునేందుకు అనేక మంది ఆశ చూపి కోట్లు పోగేసుకుని బోర్డు తిప్పేస్తుంటారు. ఇలాంటి విషయాల్లో బాధితులకు నూటికి 100 శాతం న్యాయం జరగదు. ఇక ఇలా మోసపోయిన వారైతే ఎవరికి తమ బాధ చెప్పుకోవాలో, ఎక్కడ తమకు న్యాయం జరుగుతుందో అనే ఆశతో ఎదురు చూస్తుంటారు. మరికొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతారు. ఇలాంటి అభాగ్యుల కోసం ఏపీ సీఎం వైఎస్ జగన్ దేశంలోనే తొలిసారిగా.. ఆర్థికంగామోసపోయిన వారికి ప్రభుత్వం తరపున పరిహారం అందించారు. ఇలా మోసపోయిన వారిలో మొదటగా రూ. 10 వేల లోపు డిపాజిట్లు ఉన్నవారికి ప్రభుత్వమే నేరుగా చెల్లించబోతోందని తెలిపారు. 


ఇకపోతే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకోవడానికి, ఇచ్చిన మాట ప్రకారం నిధులను మంజూరు చేసి, దేశంలోనే ప్రైవేట్‌ డిపాజిట్‌దారులను ఆదుకున్న మొదటి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేరు తెచ్చుకున్నారు. గతంలో బాధితులు ఆందోళన చేస్తే టీడీపీ ప్రభుత్వం వారిపై కేసులు పెట్టడమే కాక, అగ్రిగోల్డ్‌ ఆస్తులను కొట్టేయడానికి ప్రయత్నించారని వైసీపీ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇక ఈ విషయంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ. రాజకీయాల్లో ఉన్న తాము ఆనందం వ్యక్తం చేసే రోజు ఇది అని హర్షం వెలిబుచ్చారు. అగ్రిగోల్డ్‌ బాధితుల తరపున పోరాటం చేసిన తర్వాత తమ కార్యాలయంలోనే దాదాపు 80 శాతం మంది బాధితులు తమపేర్లు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు...


మరింత సమాచారం తెలుసుకోండి: