కళ్ళు మూసుకు పోయిన కామందులు గర్భిణి అని చూడకుండా అత్యాచార యత్నం చేసారు. అడ్డువచ్చిన బాధితురాలి భర్తను చంపడానికి ప్రయత్నించారు ఇప్పుడా వ్యక్తి చావు బతుకుల మద్య కొట్టు మిట్టాడుతున్నాడు. సంఘటన వివరాలలోకి వెళితే .... మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట్‌కు చెందిన రామకృష్ణ(30), హరితలక్ష్మి(25) దంపతులు. లక్ష్మి ఆరు నెలల గర్భిణి కావడంతో రామకృష్ణ ఆమెను నయాపూల్ మెటర్నిటీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో ప్రతి పనికీ లంచం ఇవ్వాల్సి రావడంతో వెంట తెచ్చుకున్న నగదు అయిపోయింది. పైగా సులభ్ కాంప్లెక్స్ లో వెళ్లిన ప్రతిసారీ డబ్బులు చెల్లించాల్సి రావడంతో ఆదివారం రాత్రి సమయంలో ఆస్పత్రి పక్కనే ఉన్న మూసీ నది ఒడ్డున కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఏడుగురుదుండగులు అక్కడికి వచ్చి లక్ష్మిపై లైంగిక దాడికి యత్నించారు, అడ్డుకోబోయిన ఆమె భర్తపై కత్తులతో దాడి చేశారు. బాధితుల కేకలు విని అటుగా వెళ్లేవారు రావడంతో దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న షాహినాయత్‌గంజ్ పోలీసులు రామకృష్ణను ఉస్మానియా ఆస్పత్రిలో చేర్పించారు. పొట్ట, మెడ, వీపు వెనుక, పక్కటెముకలు, భుజాల్లో మొత్తం 12 చోట్ల కత్తిపోట్లున్నాయని రామకృష్ణ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. కాగా, దుండగులను పట్టుకునేందుకు రెండు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించినట్లు షాహినాయత్‌గంజ్ ఇన్‌స్పెక్టర్ పి.సత్తయ్యగౌడ్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: