మన దేశంలో అంత ఈజీగా దొరకని దర్శనం ఎవరిది? ఈ ప్రశ్న కాంగ్రెస్ నేతలను అడిగితే తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పేరు ఠక్కున చెబుతారు. సోనియా దర్శనం కోసం 10 జన్‌పథ్ వద్ద మన నేతలు పడిగాపులు కాస్తున్నారు. సోనియా ఇంటి వద్ద జాతరను తలపిస్తోంది. సోనియా నివాసానికి వెళ్లే రహదారులు అన్నీ కాంగ్రెసు నాయకులతో కిక్కిరిసిపోయాయి. కేంద్ర మంత్రులు బలరాం నాయక్, రాష్ట్రమంత్రి గీతారెడ్డి సహా రాష్ట్రానికి చెందిన పలువురు అగ్రనేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా అధిష్టానమ్మ దయ కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. దాదాపు 20 మందికి పైగా తెలంగాణ ఎమ్మెల్యేలు అక్కడే ఉన్నారు. సోనియా గాంధీ అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. హస్తినలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ నివాసం జాతరను తలపిస్తోంది. నిన్న జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొనేందుకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన నేతలు అమ్మ దర్శనం కోసం పడిగాపులు కాస్తున్నారు. దాంతో సోనియా నివాసానికి వెళ్లే దారులన్నీ కాంగ్రెస్ నాయకులతో కిక్కిరిసిపోయాయి. మరి కొందరికైనా అమ్మ దర్శనం లభిస్తుందో లేదో.. 

మరింత సమాచారం తెలుసుకోండి: