మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోని... మైదానంలో ఎంతో ప్రశాంతంగా ఉంటూ... అద్భుతమైన వ్యూహాలతో... టీమిండియా బాధ్యతను భుజాన వేసుకుని ముందుకు నడిపిస్తూ... టీమిండియాకు కనీవినీ ఎరుగని గొప్ప విజయాలను అందించిన సారథి మహేంద్ర సింగ్ ధోనీ. తనకంటూ క్రికెట్ లో కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్నాడు. ఏ భారత సారథి సాధ్యం కానీ మూడు వరల్డ్ కప్ లను టీమ్ ఇండియాకు అందించిన అత్యుత్తమ సారథి మహేంద్రసింగ్ ధోని. ఇప్పటికి ఎంతో మంది యువ ఆటగాళ్లకు ఇన్స్పిరేషన్ గా నిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ డబల్ సెంచరీ వీరుడు రోహిత్ శర్మ మహేంద్రసింగ్ ధోనియే మాకు బెస్ట్ కెప్టెన్ అంటూ ప్రశంసలు కురిపించాడు.
మైదానం లో ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ అద్భుతమైన వ్యూహాలు రచించడంలో ధోనీ సిద్ధహస్తుడు అంటూ ప్రశంసించాడు . ఇప్పటికీ తమ అత్యుత్తమ టీమిండియా కెప్టెన్ ధోనీ అని సహచర క్రికెటర్లు స్పష్టం చేస్తున్నారు అంటే ఎంతటి ప్రత్యేకత ఉందని గుర్తు చేసుకోవచ్చు అంటూ తెలిపాడు రోహిత్ శర్మ . మొన్నటికి మొన్న టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ధోని పై ప్రశంసలు కురిపించగా ఇప్పుడు రోహిత్ శర్మ ప్రశంసించాడు. ధోని ఎప్పుడు ప్రశాంతంగా ఉండటం అతను మంచి నిర్ణయాలు తీసుకోవడానికి దోహదం చేస్తుంది.. ధోని ఎలా సక్సెస్ క్యాప్టెన్ అయ్యాడో అందరికీ తెలిసిన విషయమే. మూడు ఐసీసీ ట్రోపీలు మూడు ఐపీఎల్ టైటిల్ లు సాధించి... అత్యుత్తమ కెప్టెన్ అని నిరూపించుకున్నాడు అంటూ చెప్పుకొచ్చాడు రోహిత్ శర్మ.
మ్యాచ్ పరిస్థితులను బట్టి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో ధోని సాటి లేరు. ఎప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉంటూ.. యువ బౌలర్లకు ఎక్కువగా అవకాశాలు ఇస్తూ... ధోని వారి నుంచి మంచి ఫలితాలు రాబడతాడు అంటూ రోహిత్ శర్మ తెలిపారు. అంతేకాకుండా బౌలర్లందరికి బంతి ఎలా చేయాలి అనే దానిపై సలహాలు ఇస్తూ ఒత్తిడిని తగ్గిస్తూ ఉంటాడు . యువ ఆటగాళ్లు పై నమ్మకం ఉంచి ఫలితాలు రాబడుతూ ఉంటాడు. అందుకే ఇప్పటికీ మాకు ధోనినే బెస్ట్ కెప్టెన్ అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.