భారత క్రికెట్లో గొప్ప ఆటగాడిగా తనకంటూ కొన్ని ప్రత్యేకమైన పేజీలు లిఖించుకున్న ఆటగాడు మహేంద్రసింగ్ ధోని.ఏ భారత కెప్టెన్ కి సాధ్యం కాని రెండు ప్రపంచకప్ లు భారత జట్టుకు అందించిన గొప్ప ఆటగాడు. అలాంటి ఆటగాడి కెరీర్ ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారిన విషయం తెలిసిందే. గత కొన్ని నెలల నుంచి ధోనీ క్రికెట్ కు దూరంగా ఉంటున్నారు. 2019లో వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ తర్వాత మహేంద్రసింగ్ ధోని పూర్తిగా క్రికెట్ కి దూరంగా ఉంటున్నాడు. అసలు మైదానంలో కనిపించింది లేదు. ఈ నేపథ్యంలో ధోని క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడ అనే ప్రశ్న అందరిలో నెలకొంది.
అయితే తన రిటైర్మెంట్ పై ఇప్పటివరకు ధోని స్పందించిన దాఖలాలు లేవు. ఇక అటు ఐపీఎల్లో సత్తా చాటి జట్టులోకి పునరాగమనం చేస్తారని అభిమానులు అనుకున్నప్పటికీ ఐపీఎల్ పూర్తిగా రద్దు అయిపోయింది. దీంతో ధోని కెరియర్ మరింత అయోమయంలో పడిపోయింది. ఇక ప్రస్తుతం ఆటగాళ్ల అందరికీ ఎక్కడ చూసినా ఇదే ప్రశ్న ఎదురవుతుంది ధోని మళ్ళీ క్రికెట్ ఆడతాడా జట్టులోకి వస్తాడ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు నెటిజన్లు . తాజాగా భారత జట్టు స్టార్ ఓపెనర్.. డబుల్ సెంచరీలు దీరుడు రోహిత్ శర్మ కు కూడా ఇలాంటి ప్రశ్న ఎదురవడంతో తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు రోహిత్ శర్మ .
తాజాగా సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తో ఇంస్టాగ్రామ్ లో లైవ్ చాట్ లో పాల్గొన్న రోహిత్ శర్మ అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఈ సందర్భంగా ధోని గురించి ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ధోని ఒకవేళ క్రికెట్ ఆడడం ఆపేస్తే ఎవరికీ దొరకదు.. పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి పోతాడు.. ధోని రాంచి లో ఉంటాడు అనే విషయం అందరికీ తెలుసు.. క్రికెట్ ఆడతాడా లేదా అనే అనుమానం అందరిలో ఉంది.. నువ్వు ఒక పని చెయ్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ఉంది కాబట్టి అది ముగిసిపోయాక ధోని వద్దకు వెళ్లి.. డైరెక్ట్ గా ధోనీనే అడుగు మీరు మళ్ళీ క్రికెట్ ఆడతారా ఆడరా అని. . నాకైతే ధోని గురించి ఎలాంటి సమాచారం తెలియదు. వరల్డ్ కప్ తర్వాత ధోనీ నుంచి ఎలాంటి సమాచారం మాకు రాలేదు అంటూ రోహిత్ సమాధానమిచ్చాడు. ఈ సందర్భంగా బదులిచ్చిన హర్భజన్ సింగ్ ధోనీ ఇండియా జెర్సీ ధరించక పోవచ్చు .. అతనికి ఇక భారత జట్టులో ఆడాలని లేనట్లుంది అంటూ పేర్కొనడం ఆసక్తిని రేపుతోంది.