సుప్రీంకోర్టు చెప్పినంత పనీ చేసింది. లోధా కమిటీ సిఫారసులను బీసీసీఐ అమలు చేయకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ వచ్చిన సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, ప్రధాన కార్యదర్శి అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగించింది.