భారత క్రికెట్ జట్టుతో పోటీ
పడే ప్రత్యర్ధి జట్టు ఎవరైనా సరే ముందు
టార్గెట్ విరాట్ కోహ్లీపైనే దృష్టి పెడుతారు..ఆ పరుగుల వరదను పెవిలియన్ కి పంపితే
చాలు సగం విజయం సాధించినట్టే అంటూ ప్లాన్స్ వేసుకుంటారు..విరాట్ ని ఎంత తొందరగా
అవుట్ చేయాలి అనే దానిపై వ్యుహరచనలు చేస్తారు..ఇది ఏ ఒక్క జట్టు మాటో , ఏ ఒక్క
క్రికెటర్ మాటో కాదు దాదాపు అన్ని జట్ల క్రికెటర్లు ఇలానే భావిస్తారు...ఎందుకంటే
కోహ్లీ వస్తే బౌలర్స్ ని చీల్చి చెండాడే విధానం చుస్తే అందరికీ అర్థం
అవుతుంది..మ్యాచ్ ని ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఒక్క సారిగా మార్చేయగల సత్తా
ఉంది కోహ్లీకి..అలాంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కూడా..
అయితే అందరి మాటలకి భిన్నంగా దక్షిణాఫ్రికా బౌలర్ ఫిలాండర్ మాత్రం మా లక్ష్యం కోహ్లీ కాదు జట్టులో ఉన్న ప్రతీ ఒక్క ఆటగాడు అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు.. శుక్రవారం భారత్-దక్షిణాఫ్రికా మధ్య శుక్రవారం తొలి టెస్టు ప్రారంభం కానున్న నేపధ్యంలో ఫిలాండర్ మీడియాతో మాట్లాడాతూ “భారత్తో మేము మ్యాచ్ ఆడేటప్పుడు వ్యక్తులని పట్టించుకోము మాకు కనబడేది ,చూసేది బ్యాట్ , బంతి మాత్రమే అని అన్నాడు. కోహ్లీ అంటే మాకు అందరిలాగానే ఒక బ్యాట్స్ మెన్ అంతే అని అన్నాడు.
ఇప్పటి వరకూ ఆడిన మ్యాచ్ లు అన్ని కూడా తమ సొంత గడ్డపైనే ఆడింది కానీ ఇప్పుడు విదేశాలలో ఆడటానికి వస్తోంది కాబట్టి ఇక్కడ మా గడ్డపై ఎలా రానిస్తుందో చూడాలి అన్నాడు.. అంతేకాదు భారత్ పిచ్ లకి ఇక్కడి పిచ్ లకి పోలిక అస్సలు ఉండదు..కేప్టౌన్లో జరగబోయే మొదటి టెస్టులో ఎలా ఆడతారో చూద్దాం’ అని ఫిలాండర్ వ్యాఖ్యానించారు..నాకు కేప్టౌన్ లో ఆడిన అనుభవం ఎక్కువగా ఉంది..ఇక్కడ పిచ్ లు మాకు ఎంతో అనుకూలంగా ఉంటాయి..మా వ్యూహాలు ఎలా అమలు చేస్తాము అనేదానిపై ఇప్పుడు స్పష్టత ఇవ్వలేను అన్నాడు.మా స్పిన్నర్స్ ఎంతో అత్యుత్తమ బౌలర్స్ అంటూ కితాబు ఇచ్చాడు..అయితే కోహ్లీ అంటే భయం లేదు అంటూనే కోహ్లీ గురించి ఎక్కువగా మాట్లాడటం చుస్తే ఫిలాండర్ ఎంతగా బయపడుతున్నాడో అర్థం అవుతోంది అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు