కేప్టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ 72
పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే..అయితే...కోహ్లీ
వికెట్ విషయంలో మేము అనుకునట్టుగానే మా వ్యూహాన్ని అమలు పరిచాం..అని రెండో ఇన్నింగ్స్
లో ఆరు వికెట్స్ తీసి దక్షిణాఫ్రికాకి విజయాన్ని అందించిన పేసర్ ఫిలాండర్ అన్నాడు..కోహ్లీ పై మాకు
ఉన్న వ్యూహం విషయంలో ఎంతో క్లారిటీగా ఉన్నాము అని చెప్పాడు..
విరాట్ ఎంతో అధ్బుతమైన ఆటగాడు.ఎంతో తెలివిగా అంతకంటే దూకుడుగా ఆడుతాడు కూడా అయితే అతని దూకుడు పెంచకుండా..అనవసరంగా రెచ్చగొట్టకుండా..మా ప్లాన్ పక్కగా అమలు చేశాము..అతడు ప్రశాంతంగా ఆడటమే మా ప్రణాళిక అప్పుడే నేను తనని పెవిలియన్ కి పంపగలను అని నాకు తెలుసు..కోహ్లీ వికెట్ల ముందు దొరికిపోయిన తర్వాత సమీక్షకు వెళ్లినప్పుడూ నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను అది అవుట్ అని..చెప్పుకొచ్చాడు ఫిలాండర్.
అయితే కోహ్లీ వికెట్ పడినప్పుడు నేను రెచ్చగొట్టలేదని తెలిపాడు..ప్రత్యర్ధి వికెట్స్ నాకు ముఖ్యం అందుకే ఎంతో..వైవిధ్యమైన బంతులు వేశానని చెప్పాడు.. బంతి పాతది కావడం పిచ్ అనుకూలించడంతో అశ్విన్ బాగా ఆడాడు అని తెలిపాడు పిచ్ మందంగా ఉండటంతో క్రీజు నుంచి ముందుకొచ్చి బంతిని ఎదుర్కొన్నాడు కానీ అతని కట్టడికి నేను వేసిన ప్లాన్ సక్సెస్ అయ్యింది అంటూ చెప్పుకొచ్చాడు అదే ఓవర్ లో మూడు వికెట్లు తీశాడు ఫిలాండర్