దక్షిణాఫ్రికాతో
ప్రస్తుతం భారత్ కి జరుగుతున్న “టీ20” మొదటి
మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించింది..తాజాగా
వన్డే మ్యాచ్ లలో గెలిచి భారత్ జెండాని సఫారీల
గడ్డపై ఎగరేసిన ఘనత భరత్ ఆటగాళ్ళ సొంతం
అయ్యింది..తాజాగా మొదలు పెట్టిన “టీ20” మ్యాచ్ లలో మొదటి విజయం సాధించింది..
సఫారీల గడ్డపై జరిగిన తొలి ట్వంటీ 20 మ్యాచ్లో టీమిండియా 28 పరుగులతో తొలి విజయం సాధించింది...శిఖర్ ధావన్ (72: 39 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు ఇదిలా ఉంటే రోహిత్ శర్మ 9 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 21, విరాట్ కోహ్లీ 20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్తో 26 పరుగులతో రాణించారు. భారత బౌలర్ల దాటికి సఫారీలు విలవిలలాడిపోయారు. భువనేశ్వర్ కుమార్ 5 వికెట్లు పాండ్యా, చహల్, ఉనడ్కట్ చెరొక వికెట్ తీశారు.
అయితే మొదట బ్యాటింగ్ చేసిన...భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. సఫారీల ముందు 204 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది...అయితే ఆ ఆతరువాత బ్యాటింగ్ కి దిగిన సఫారీలకి భువనేశ్వర్..తర్వాత బ్యాటింగ్కు దిగిన సఫారీరాలకి భువనేశ్వర్ (5/24) తో మట్టి కరిపించాడు,