రాహుల్ ద్రావిడ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు..వాళ్ళు నన్ను మోసం చేశారు అంటూ
పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేశాడు..ఈ వార్తతో అందరు షాక్ అయ్యారు రాహుల్ ని
మోసం చేసిన వాళ్ళు ఎవరు అంటూ మండి పడుతున్నారు ఇంతకీ రాహుల్ ని మోసం చేసింది
ఎవరు..?ఏమిటా కధ అంటే ..
చెందిన విక్రమ్ ఇన్వెస్టిమెంట్స్ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటే రూ.20కోట్లు పెట్టుబడి పెట్టాడు రాహుల్ అయితే ఇప్పుడు తనను ఆ కంపెనీ మోసం చేసిందని సదాశివ నగర్ పోలీస్ స్టేషన్లో శనివారం ఫిర్యాదు చేసినట్లు రాహుల్ మీడియా కి చెప్పాడు..అయితే లాభాలు ఇవ్వకపోగా అసలు పెట్టుబడిలో రూ.4కోట్లు ఆ కంపెనీ తమను మోసం చేసిందని.. మీడియా ముందు వాపోయాడు రాహుల్..
ఇదిలాఉంటే ఇప్పటికే ఆ కంపెనీ 800 మంది పెట్టుబడిదారులను మోసం చేసి దాదాపు రూ.300 కోట్ల మేర డబ్బు మాయం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి తాజాగా కంపెనీలో పెట్టుబడి పెట్టిన పీఆర్.బాలాజీ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఈ తతంగం అంతా బయట పడింది..అయితే ఈ కంపెనీపై ఇప్పటివరకు 100కుపైగా కేసులు నమోదు కావడం సంచలన సృష్టించింది..ఈ కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. ఇందులో పెట్టుబడి పెట్టి మోసపోయిన వారిలో ద్రావిడ్తో పాటు బాలీవుడ్ యాక్టర్స్ కూడా ఉన్నారు..క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ తండ్రి, ప్రకాశ్ పదుకోన్ కూడా ఈ లిస్టు లో ఉన్నారు పోలీసులు రాహుల్ ఫిర్యాదుని స్వీకరించి దర్యాప్తు చేస్తున్నారు..