ఐపీఎల్ -11 సీజన్ లో భాగంగా
ఈడెన్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ మరియు కోల్కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన పోరులో
ఢిల్లీ పై కోల్కతా 71 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది...ముందుగా బ్యాటింగ్ కి దిగిన కోల్కతా 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది ఢిల్లీ
ముందు ఉంచింది..గంభీర్ సేన ఈ పరుగుల లక్ష్యాన్ని సునాయసనంగా చేదిస్తుంది
అనికున్న అభిమానులకి మాత్రం తీవ్రమైన నిరాశని మిగిల్చింది.. 14. 2 ఓవర్లలో 129 పరుగులకే చేతులు ఎత్తేసింది.
ఢిల్లీ ఆటగాళ్లలో రిషబ్ 43 పరుగులని 26 బంతుల్లో 7ఫోర్లు, 1 సిక్సర్ గా మలచగా , గ్లెన్ మ్యాక్స్వెల్ 47 పరుగులని 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు మలిచాడు మిగతా ఆటగాళ్లంతా సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో ఘోర పరాజయం తప్పలేదు. అయితే ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం లో పరుగుల పరంగా ఇదే పెద్ద విజయం కావడం విశేషం. కేకేఆర్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్, సునీల్ నరైన్ తలో మూడో వికెట్లు సాధించగా, పీయూష్ చావ్లా, రస్సెల్, శివం మావి, టామ్ కుర్రాన్లు తలో వికెట్ తీశారు.
అయితే అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కి దిగిన కేకేఆర్ నిర్ణీత ఓవర్లలో తొమ్మిది వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. కేకేఆర్ ఆటగాళ్లు నితీష్ రానా, ఆండ్రీ రస్సెల్ మెరుపులు మెరిపించడంతో స్కోరు బోర్డు రెండొందల మార్కును చేరింది...రానా 35 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 59 పరుగులు చేయగా, రస్సెల్ 12 బంతుల్లో 6 సిక్సర్లతో 41 పరుగులు సాధించాడు. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్(19) ఔటైన తర్వాత వచ్చిన రస్సెల్.. నితీష్ రానాతో కలిసి కీలక ఇన్నింగ్స్ ఆడారు మొత్తానికి గంభీర్ సేన కోల్కతా ముందు చతికల పడింది..