టీం
ఇండియా క్రికెటర్ ఆల్ రౌండర్ అయిన రవీంద్ర జడేజా భార్య కి చేదు అనుభవం ఎదురయ్యింది..తప్పు
ఏమి జరిగింది..ఎవరిది తప్పు అనే విషయాలు పక్కన పెడితే క్రికెటర్ భార్య పరువు
మాత్రం నడి రోడ్డులో అందరి ముందు పోయింది..దాంతో ఆమె తనకి అవమానం కలిగించిన
కానిస్టేబుల్ పై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది..అసలేం జరిగిందనే వివరాలలోకి
వెళ్తే...
రవీంద్ర జడేజా భార్య “రీవా సోలం” కి ప్రయాణీస్తున్న కారు రాంగ్ రూటులో వస్తున్న కానిస్టేబుల్ సజయ్ అహిర్ టూ వీలర్ను స్వల్పంగా ఢీకొంది...దాంతో ఒక్క సారిగా జడేజా భార్య కానిస్టేబుల్తో వాగ్వివాదానికి దిగింది. అయితే చివరికి ఈ గొడవ చిలికి చిలికి ఆమె పై అతడు చేయి చేయి చేసుకునేంతగా ముదిరిపోయింది..ఈ ఘటన సోమవారం సాయంత్రం గుజరాత్లోని జామ్నగర్లో సారు సెక్షన్ రోడ్డులో చోటుచేసుకుంది.
కారు, బైకును ఢీకొన్న వెంటనే కోపంతో కారు వద్దకు చేరుకున్న సదరు కానిస్టేబుల్ “అహిర్” ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆమెపై దాడికి పాల్పడ్డాడు...అంతేకాదు ఒక దశలో దశలో రీవాను జుట్టు పట్టుకుని కొట్టడానికి ప్రయత్నించగా తాము అడ్డుకున్నామని ప్రత్యక్ష సాక్షులు కూడా వెల్లడించారు. దీంతో రీవాకు స్వల్ప గాయాలైనట్లు జామ్నగర్ ఎస్పీ ప్రదీప్ సేజుల్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కానిస్టేబుల్ అహిర్ ని విచారిస్తున్నారు.