తప్పు ఏదైనా ఎంతటి స్థాయి వ్యక్తులు చేసినా సరే నిర్మొహమాటంగా మొఖం మీద కడిగేసే వ్యక్తి టీం ఇండియా ప్లేయర్ గౌతం గంభీర్...ముక్కు మీద కోపం గంభీర్ కి ఎక్కువగా ఉండే గంభీర్ ఈ సారి ఏకంగా ఐపీఎల్ యాజమాన్యాలపై విమర్శలు సంధించాడు...దాంతో ఒక్క సారిగా అందరూ విస్తు పోయారు అసలు గంభీర్ ఏమన్నాడు ఎందుకు గంభీర్ అంతగా ఫైర్ అయ్యాడు అంటే..
చెన్నై జట్టు సాధించిన విజయం గురించి మాట్లాడిన గంభీర్ ఆ జట్టుని ప్రశంసించాడు...సీఎస్కే యాజమాన్యం తమ కెప్టెన్ ధోనీని క్రికెట్ బాస్గా భావిస్తుందని.. ఫీల్డ్లో అతనికి పూర్తి స్వేచ్చను ఇవ్వడం ద్వారా ఒత్తిడిని తగ్గించి తద్వారా విజయాల్ని తమ ఖాతాలో వేసుకుంటుందని తెలిపాడు అందుకే ధోనీ విజయాన్ని సాధిస్తున్నాడని అన్నాడు గంభీర్..ఐపీఎల్ వంటి టోర్నమెంట్లో ఒక కెప్టెన్గా విజయవంతమవ్వాలంటే ఆటగాళ్లతో పాటు యాజమాన్యం సహకారం కూడా ఎంతో ముఖ్యమని గంభీర్ పరోక్షంగా తన జట్టు యాజమాన్యం ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాడు..
ఐపీఎల్ లో క్రికెట్ ఆటకంటే కూడా ఇక్కడ ఇగోకి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని గంభీర్ అసహనం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లోని వివిధ జట్ల యజమానులు అందరు వేర్వేరు వ్యాపారాల్లో ఇప్పటికే ఎన్నో విజయాలు సాధించారని..అయితే వాళ్ళు క్రికెట్ ని కూడా వ్యాపారంగానే భావిస్తున్నాడని అన్నారు..క్రికెటర్లలాగా వారు కూడా ఓటమిని ద్వేషిస్తారని.. విజయాన్ని తమ ఖాతాలో వేసుకోవడానికి ఇష్టపడతారే గానీ.. ఒకవేళ వారి సలహాల వల్ల ఓటమి ఎదురైనపుడు అందుకు తగిన కారణాలు చూపితే వారి ఇగో దెబ్బతింటుందని పరోక్షంగా తమ జట్టు యాజమాన్య తీరును ఎండగట్టాడు.