టీం
ఇండియా లో ఉన్న అత్యంత ప్రతిభావంతమైన ఆటగాళ్ళలో ఒకడైన రోహిత్ శర్మ తనదైన ప్రతిభతో
ఎన్నో మైలు రాళ్ళు దాటుతూ వెళ్ళాడు..తాజాగా రోహిత్ శర్మ మరో అరుదైన ఘటనతని
సాధించాడు..పాత హిస్టరీ ని రోహిత్ రిపీట్ చేశాడు..భారత హిట్ బ్యాట్స్ మెన్ అయిన
రోహిత్ శర్మ ఈ అరుదైన ఘటనని సొంతం చేసుకోవడంతో అభిమానులు సంతోషం వ్యక్తం
చేస్తున్నారు..ఇంతకీ ఏమిటా ఘనత అంటారా..ఆ
వివరాలలోకి వెళ్తే..
రోహిత్ శర్మ అంతర్జాతీయ క్రికెట్లో పదివేల పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. ఐర్లాండ్తో జరిగిన టీ20లో రోహిత్ శర్మ 97 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు అంతర్జాతీయ క్రికెట్లో 10వేల పరుగుల మైలురాయిని చేదించాడు..టెస్ట్ , వన్డే , టీ20.. ఈ మూడు ఫార్మాట్లలో కలిపి రోహిత్ శర్మ సాధించిన పరుగులు 10,022. ..అయితే ప్రస్తుతం కోహ్లీ నాయకత్వంలోని టీమిండియా ఐర్లాండ్లో పర్యటిస్తోన్న సంగతి తెలిసిందే. పర్యటనలో భాగంగా ఆతిథ్య ఐర్లాండ్తో భారత జట్టు రెండు టీ20లు ఆడుతోంది.
బుధవారం ఇరు జట్ల మధ్య తొలి టీ20 జరిగింది. ఈ మ్యాచ్లో భారత్ 76 పరుగుల తేడాతో ఐర్లాండ్ను చిత్తుగా ఓడించింది. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ-శిఖకర్ధావన్ తొలి వికెట్కు 160 పరుగులు జోడించారు...ఇదిలాఉంటే భారత్ తరఫున సచిన్..రాహుల్ ద్రవిడ్..సౌరభ్ గంగూలీ..వీరేంద్ర సెహ్వాగ్..విరాట్ కోహ్లీ అజారుద్దీన్, సునీల్ గావస్కర్, యువరాజ్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, గౌతమ్ గంభీర్తో పాటు మరికొందరు మాత్రమే అంతర్జాతీయ క్రికెట్లో మూడు ఫార్మాట్లలో కలిపి పదివేలకు పైగా పరుగులు సాధించారు...అయితే ఈ ఘనత సాధించిన మరో భారత ఆటగాడిగా రోహిత్ రికార్డ్ సొంతం చేసుకున్నాడు.