టీమిండియా డేరింగ్ అండ్
డాషింగ్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ కి చేరువలో ఉన్నాడు..ఇప్పటికే తన
దూకుడు ఆటతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ ఈ సారి టీమిండియా మాజీ
క్రికెటర్ అజహరుద్దీన్ రికార్డ్ పై కన్నేశాడు. ఇటీవల జరిగిన ఆసియా కప్కు దూరంగా
ఉన్న కోహ్లీ విండీస్తో రెండు టెస్టుల సిరీస్కు రెడీ అవుతున్నాడు.
అదెలా అంటే టెస్టుల్లో వెస్టిండీస్పై అజారుద్దీన్ 539 పరుగులు చేశాడు. ఇప్పుడీ రికార్డును కోహ్లీ అధిగమించనున్నాడు. కోహ్లీ వెస్టిండీస్పై ఇప్పటి వరకు టెస్టుల్లో 502 పరుగులు చేశాడు. మరో 37 పరుగులు చేస్తే అజార్ రికార్డు బద్దలవుతుంది..అయితే ఇప్పటికే ధోనీ 476 పరుగుల రికార్డును కోహ్లీ చేదించగా 38.61 బ్యాటింగ్ సగటుతో 502 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.
అయితే వెస్టిండీస్పై అత్యధిక పరుగులు చేసిన భారతీయు క్రికెటర్ ల లిస్టు దిగ్గజ బ్యాట్స్మన్ సునీల్ గవాస్కర్ పేరు మొదటి స్థానంలో ఉన్నాడు 2746 పరుగులు చేసిన గవాస్కర్ జాబితాలో టాప్ ప్లేస్లో కొనసాగుతున్నాడు. 1978 - పరుగులతో ద్రవిడ్..అదేవిధంగా - 1715 పరుగులతో వీవీఎస్ లక్ష్మణ్ రెండు మూడు స్థానాల్లో ఉన్నారు.