భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ బీసీసీఐ
కి అల్టిమేటం జారీ చేశాడు చేస్తారా చస్తారా అనే విధంగా బోర్డ్ పై ఒత్తిడి పెంచాడు...అయితే
అతడు అడిగిన కోరిక తన ఒక్కడి కోసం మాత్రమే కాదని జట్టులోని అందరి తరుపునా
అడుగుతున్నానని
తెలిపాడు ఇంతకీ కోహ్లీ అభ్యర్ధన
ఏమిటి..బీసీపై ఎందుకు కోహ్లీ పైర్ అయ్యాడు అనే వివరాలలోకి వెళ్తే..విదేశీ సీరీస్ లలో ఆటగాళ్ల వెంట వారి భార్యలు కూడా వెళుతుంటారఅయితే బిసిసిఐ నిబంధనల ప్రకారం ఆ సీరిస్ ఎన్ని
నెలలు సాగినా ఒక్కో సారి చాలా సార్లు ఆటగాళ్ళ సతీమణులకు మాత్రం కేవలం రెండు వారాలే అనుమతి
ఉంటుంది.
దీంతో కొన్ని సార్లు క్రికెటర్లు తమ భార్యా, పిల్లల్ని వదిలి నెలల తరబడి ఒంటరిగా ఉండాల్సి ఉంటుంది..దీన్ని వెంటనే మార్చాలని కోహ్లీ దీంతో ఈ నిబంధనపై భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యతిరేకత వ్యక్తం చేశాడు. దీన్ని వెంటనే మార్చాలంటూ బిసిసిఐ కి విజ్ఞప్తి చేశాడు.
ఇదిలాఉంటే కోహ్లీ కోహ్లీ బిసిసిఐ వ్యవహారాలను చూసుకుంటున్న వినోద్ రాయ్ నేతృత్వంలోని పాలక మండలి(సీఓఏ) ముందు తమ ఆవేదనను వెల్లడించినట్లు సమాచారం. కేవలం రెండు వారాలే కాకుండా సిరీస్ ఎన్ని రోజులుంటే అన్ని రోజులు క్రికెటర్లతో పాటు భార్యలను కూడా అనుమతించాలని కోహ్లీ సీఓఏని కోరాడు..అయితే ఈ అభ్యర్థనపై తక్షణ నిర్ణయం తీసుకోలేమని సీఓఏ తేల్చిచెప్పింది. ఈ విషయంపై నిర్ణయం తీసుకునే అధికారం తమకు లేదని...దీనిపై కొత్తగా ఏర్పడే బిసిసిఐ కార్యవర్గమే నిర్ణయం తీసుకుంటుందని సీఓఏ అధికారులు తెలిపారు.