గురువారం రాత్రి విశాఖపట్నం నుంచి బెంగళూరు 40 మంది ప్రయాణికులతో రాజేష్ ట్రావెల్స్ కు చెందిన ఓల్వో బస్ ఒకటి బైలుదేరింది. ప్రమాదవశాత్తూ ఆ బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న టాటా ఏస్ వాహనం పై ఒరిగిపోయింది. రేణిగుంట ఆర్టీవో చెక్ పోస్టు సమీపం లో శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది.


రాత్రి టీ తాగుటకు ఆపిన సమయంలో బస్ డ్రైవర్లు మారారు. బస్సు అతి వేగం మరియు బ్రేక్స్ పడకపోవటం కారణంగా అదుపు తప్పి పక్కనే ఉన్న టాటా ఏస్ వాహనం పై వాలింది.బస్సులో ఉన్న ప్రయాణికులు అద్రుష్టంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. 


అద్రుష్టవశాత్తూ టాటా ఏస్ లో ఎవరూ లేక పోవడంతో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఘటనా స్థలానికి చేరుకున్న రేణిగుంట అర్బన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.అతివేగం, బ్రేకులు ఫెయిల్ కావడమే ప్రమాదానికి కారణమని వారు సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: