కార్తీకదీపం, వదినమ్మ, ఆమెకథ, ముద్దమందారం, రక్త సంబంధం, అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, ప్రేమ, సూర్యవంశం.. ఇలా ఒకటా రెండా.. లేక్కలేనన్ని సీరియల్స్ బుల్లితెరపై అలరిస్తున్నాయి. మహిళలను టీవీలకు అతుక్కుపోయేలా చేస్తున్న ఈ టీవీ సీరియల్స్ ఏకంగా స్టార్ హీరోల సినిమాలపై సైతం దెబ్బ కొడుతున్నాయి. రోజుల తరబడి కాదు కాదు నెలల తరబడి.. కాదు కాదు సంవత్సరాల తరబడి అలరించే సీరియళ్లకు ఎక్కువ మొత్తంలో ఫాన్స్ ఉంటారు. అయితే తాజాగా జీ తెలుగు సీరియల్స్ ప్రమోషన్స్కు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబును రంగంలోకి దించింది. ఎప్పుడూ ధమ్స్ అప్ తాగమనే మహేష్ బాబు ఇప్పుడు జీతెలుగు సీరియల్స్ చూడమంటూ చెబుతున్నారు.
ఇటీవల జీ తెలుగు త్రినయని, తూర్పు- పడమర, ప్రేమ ఎంత మధురం అని మూడు సీరియల్స్ అతి త్వరలో ప్రసారం చేయడానికి ఏర్పాట్లు చేసుకుంది. వీటి ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ ప్రదీప్ తో కలిసి మహేష్ ఈ సీరియల్స్ కొన్ని మాటలు కూడా చెప్పారు. ఆ సమయం వాళ్ళు మహేష్ తో డిజైన్ చేసిన ఈ ప్రోమో మంచి హాట్ టాపిక్ కావడంతో ఆ సీరియల్స్ పై హైపి క్రియేట్ అయింది. అయితే ఇందులో ఒక సీరియల్ ప్రస్తుతం టెలికాస్ట్కు రంగం సిద్ధం చేసుకుంది. ప్రేమకు వయసుకు సంబంధం లేదని చూపించే ఓ అద్భుతమైన ప్రయత్నమే `ప్రేమ ఎంత మధురం` సీరియల్.
సూపర్ స్టార్ మహేష్ ప్రమోట్ చేసిన ఈ సరికొత్త సీరియల్ వచ్చే ఫిబ్రవరి 10 ప్రతీ సోమవారం నుంచి శనివారం వరకు ప్రారంభం కానుంది. అలాగే మహేష్ బాబు కూడా ఈ సీరియల్కు మంచిగా ప్రమోట్ చేశారు. ప్రోమోలో హీ ఈస్ ఆర్య 40 ఇయర్స్.. షి ఈస్ రమ్య 19 ఇయర్స్.. ఇద్దరూ ప్రేమలో ఉన్నారు అంటూ ప్రదీప్.. మహేష్కు పరిచయం చేస్తాడు. అలాగే ఇది వర్కౌట్ అవుతుందంటారా? అంటూ అడుగుతారు ప్రదీప్. దానికి సూపర్ స్టార్ వెంటనే..ఎందుకు కాదు.. ప్రేమకు వయసుతో సంబంధం ఏముంటుంది అని అంటూ చూడండి ''ప్రేమ ఎంత మధురం'' అని చెబుతారు. మరి సూపర్ స్టార్ చెప్పినట్టు ఈ సీరియల్ ఎంత వరకు వర్కోట్ అవుతుందో చూడాలి.