చక్రవాకం.. మంజుల నాయుడు దర్శకత్వం వహించిన ఈ సీరియల్ ఆరేళ్ళ పాటు ఓ ఊపు ఊపేసింది. ఈ సీరియల్ లో పాత్రలు ఇప్పటికి గుర్తుంటాయి.. ఇప్పుడు మళ్లీ మళ్లీ వేసిన ప్రేక్షకులు చూస్తూనే ఉంటారు.. నిజం చెప్పాలి అంటే.. ఇప్పుడు కార్తీక దీపం సీరియల్ ఎంత పాపులర్ ఓ అప్పట్లో చక్రవాకం సీరియల్ కూడా అంతే పాపులర్. 

 

ఇంద్రనీల్ హీరోగా, ప్రీతీ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సీరియల్ ఎన్నో మలుపులతో.. ట్విస్టులతో.. ఫైట్ లతో సూపర్ హిట్ అయ్యింది. సీరియల్ అంటే ఇది అని అనిపించేలా ఆ సీరియల్ ను తీశారు. ఇంకా ఆ సీరియల్ పాత్రలు ఏడిస్తే చూసే ప్రేక్షకులకు కూడా కన్నీళ్లు వచ్చేవి.. ఒక్క ఎపిసోడ్ మిస్ అయితే తెగ ఫీల్ అయ్యేవారు అప్పట్లో అమ్మమ్మ.. నానమ్మలు. 

 

ఈ సీరియల్ కు అంత డిమాండ్ ఉండేది. ఆ సీరియల్ లో ఎప్పుడు హీరోయిన్, హీరో కలిసి ఉండకపోయినా సరే ఒక్కసారైన కలవకపోతారా? అని చూసేవారు.. కన్నీళ్లు వచ్చిన తుడుచుకొని వెళ్లేవారు.. అంతేకాదు.. అప్పట్లో కేవలం ఈటీవి, జెమినీ టీవీ మాత్రమే వచ్చేవి.. ఇంకా జీ తెలుగు, స్టార్ మా ఇప్పుడిప్పుడు వచ్చి తోక జాడిస్తున్న చానెల్స్. 

 

ఇంకా అప్పట్లో కేవలం ఈ రెండు చానెల్స్ ఏ అవ్వడంతో ఈ సీరియల్ కు ఎంతోమంది ఫ్యాన్స్ అయ్యారు. అలానే తెలుగు ప్రజలంతా కూడా ఈ సీరియల్స్ కు ఫ్యాన్స్ అయ్యారు.. ఇంకా ఆ సీరియల్ అయినా తర్వాత మొగలి రేకులు సీరియల్ కి కూడా ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు.. ఈ రెండు సీరియల్స్ ఇప్పుడు జెమినీ టీవీలో ప్రతి రోజు మధ్యాహ్నం వేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే? ఈ రెండు సీరియల్స్ కు మంజుల నాయుడు దర్శకత్వం వహించింది.. రెండు సీరియల్స్ సూపర్ హిట్టు.

మరింత సమాచారం తెలుసుకోండి: