మన దైనందిన జీవితం లో వాట్స్ యాప్ అనేది సర్వ సాధారణం అయిపొయింది. స్మార్ట్ ఫోన్ ఉన్న వారు అందరూ వాడుతున్న యాప్ ఇది. ప్రజాదరణ లో చాలా గొప్ప రేంజ్ కి చేరుకున్న వాట్స్ యాప్ కొత్త కొత్త ఫీచర్ లని తీసుకుని వస్తోంది. తాజాగా ఆ మెసేజింగ్ యాప్లో మరో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తోంది. ఈ ఫీచర్ ద్వారా ఇకపై ఫొటోలు, వీడియోలు, జిప్ ఇమేజ్లు, ఎమోజీలు స్టేటస్లో పెట్టుకోవచ్చు. యూజర్ల స్మార్ట్ఫోన్ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారందరికీ ఈ స్టేటస్ 24 గంటల పాటు కనిపించే సౌకర్యాన్ని వాట్సప్ కల్పించింది. ఈ సందర్భంగా వాట్సప్ ప్రతినిధులు మాట్లాడుతూ... ప్రపంచవ్యాప్తంగా తమ యాప్ను 1.2 బిలియన్ మంది ఉపయోగిస్తున్నారని, వారందరికీ ఈ ఫీచర్ను త్వరలోనే అందించనున్నామని తెలిపారు.