ప్రతీ సామాన్యుడి చేతిలో సెల్ ఫోన్ ఉండాలి అనే జియో కల కొన్ని గంటల వ్యవధి లో ప్రారంభం కాబోతోంది. ఎప్పటి నుంచో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న టైం రానే వచ్చేసింది. ఇవాళ సాయంత్రం ఐదు న్నర టైం లో జియో ఫోన్ ముందస్తు బుకింగ్ లు మొదలు కాబోతున్నాయి.


ఆన్ లైన్ లో మై జియో యాప్ ని ఉపయోగించి ఆన్ లైన్ లైన్ ఐదు వందల రూపాయలు కట్టేస్తే ఈ సెల్ ఫోన్ కి సంబంధించి బుకింగ్ పూర్తి అవుతుంది. లేదా బయట రిటైలర్ షో రూమ్ లలో బారులు తీరి ఉన్న క్యూ లైన్ లలో నిలబడినా సరిపోతుంది.


రిటైల్ స్టోర్లు, మల్టీ బ్రాండ్ డివైజ్ రిటైలర్లు, రిలయన్స్ డిజిటల్ స్టోర్లలో ‘జియో ఫోన్’ను బుక్ చేసుకోవచ్చని కంపెనీ పేర్కొంది. మొదటగా ఐదు వందల రూపాయలని చెల్లిస్తే మిగితా మొత్తం సెల్ ఫోన్ డెలివరీ అయ్యే టైం లో ఇవ్వచ్చు.


స్మార్ట్ ఫోన్ లో ఉండే సదుపాయాలు అన్నీ దాదాపుగా ఇందులో మనకి ఉంటాయి. అన్ని రకాల యాప్స్ ని కూడా వాడుకోవచ్చు. సినిమాలు చూడచ్చు , వీడియో కాల్స్ కూడా చేసుకోవచ్చు. యూ ట్యూబ్ , ఫేస్ బుక్ లాంటి యాప్స్ సంగతి ఇక చెప్పక్కరలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: