టెలికం
దిగ్గజాల మధ్య పోటీ ఉదృతం అవుతోంది ఒకరిని మించి మరొకరు పోటీలు పడుతూ ఆఫర్ల మీద
ఆఫర్లు ప్రకటిస్తున్నారు..అయితే జియో ఇస్తున్న 399 సేవలకి
ఇంచుమించి రీచ్ అయ్యేవిధంగా ఎయిర్టెల్ కూడా భారీగానే ఆఫర్స్ ప్లాన్ లు
అందచేస్తోంది..అయితే ఎయిర్టెల్ తాజాగా జియో కి పోటీగా రూ.419 పేరిట మరో ఆఫర్ ని ప్రకటించింది.
అయితే ఈ ఆఫర్ కి గతంలో ఎయిర్టెల్ 399 ఆఫర్ కి మధ్య తేడా ఏమిటి అంటే..ఎయిర్ టెల్ రూ.399 ప్లాన్ లో ఉండే ప్రయోజనాలతో పాటు అధికంగా ఐదు రోజులు చెల్లుబాటు అవుతుంది. దేశ వ్యాప్తంగా ఉన్న ఎయిర్ టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు ఈ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు. 75 రోజుల వ్యాలిడిటీ గల ఈ ఆఫర్ లో ఎటువంటి (యఫ్.యూ.పీ) పరిమితి లేకుండా వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
అంతేకాదు రోజుకి 1.4జీబీ డేటాతో పాటు రోజుకు 100 ఎస్ఎంఎస్ లు పొందుతారు...అయితే ఎయిర్ టెల్ లో రోజుకి 1.4జీబీ డేటాని అందించే వివిధ రకాల ఆఫర్లు ఉన్నప్పటికీ వాటి వ్యాలిడిటీలో తేడా ఉంది..అయితే ఎలాంటి కంపెనీలు వచ్చినా సరే జియో ని దాటుకుని వెళ్ళగలిగే అవకాశం లేదని జియో ఇచ్చిన ఆఫర్లు మరే కంపెనీ ఇవ్వలేదని ఆ కంపనీ తెలపడం గమనార్హం.