శాంసంగ్ మొబైల్ కంపెనీ
మొబైల్ ప్రియులకి సరికొత్త మొబైల్ ని పరిచయం చేస్తోంది..త్వరలో ప్రపంచ మార్కెట్
లోకి తన కొత్త శాంసంగ్ మడత ఫోన్ ని విడుదల
చేయడానికి సన్నద్ధం అవుతోంది..శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ
స్మార్ట్ఫోన్ను పరిచయం చేసింది. దీనికోసం యాప్లను సిద్ధం చేయాల్సిందిగా ఆండ్రాయిడ్ డెవలపర్లను శాంసంగ్
కోరింది.
ఈ మొబైల్ 7.3 అంగుళాలు స్క్రీన్తో ఈ డివైస్ మోడల్ను ప్రదర్శించారు. ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుందో మాత్రం ఇంకా తెలుపలేదు. చూడ్డానికి పాకెట్ సైజ్లో ట్యాబ్లాగాన కనిపిస్తున్న ఈ ఫోన్ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు శాంసంగ్ తెలిపలేదు.
అయితే 7.3 అంగుళాల తెరతో మధ్యకు మడతపెట్టేందుకు వీలుగా ఉంటుందని..తెలిపింది.ఇదిలాఉంటే ఇటీవలే చైనా సంస్థ రాయల్ కార్పొరేషన్ 7.8 అంగుళాల ఆండ్రాయిడ్ మడతపెట్టే ఫోనును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.