శాంసంగ్‌ మొబైల్ కంపెనీ మొబైల్ ప్రియులకి సరికొత్త మొబైల్ ని పరిచయం చేస్తోంది..త్వరలో ప్రపంచ మార్కెట్ లోకి తన కొత్త శాంసంగ్‌ మడత ఫోన్ ని విడుదల చేయడానికి సన్నద్ధం అవుతోంది..శాన్‌ఫ్రాన్సిస్కోలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను  పరిచయం చేసింది. దీనికోసం యాప్‌లను  సిద్ధం  చేయాల్సిందిగా ఆండ్రాయిడ్‌ డెవలపర్లను శాంసంగ్‌ కోరింది.

 

ఈ మొబైల్ 7.3 అంగుళాలు స్క్రీన్‌తో ఈ డివైస్‌ మోడల్‌ను ప్రదర్శించారు.  ప్రస్తుతానికి కేవలం ఫోను డిజైన్‌ మాత్రం విడుదల చేసిన కంపెనీ దీనిని ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తుందో మాత్రం ఇంకా తెలుపలేదు. చూడ్డానికి పాకెట్‌ సైజ్‌లో ట్యాబ్‌లాగాన కనిపిస్తున్న ఈ ఫోన్ ధర, పేరు, ప్రత్యేకతల వివరాలు  శాంసంగ్‌ తెలిపలేదు.

 

అయితే 7.3 అంగుళాల తెరతో మధ్యకు మడతపెట్టేందుకు వీలుగా ఉంటుందని..తెలిపింది.ఇదిలాఉంటే  ఇటీవలే  చైనా సంస్థ రాయల్‌ కార్పొరేషన్‌  7.8 అంగుళాల ఆండ్రాయిడ్‌ మడతపెట్టే ఫోనును ఆవిష్కరించిన సంగతి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: