భారత మొబైల్ మార్కెట్లో సరికొత్త మోడల్స్ ను అందించిన వివో..తాజాగా మరో సరికొత్త ఫోన్ ను తీసుకరాబోతుంది..ఇప్పటి వరకు సింగిల్ డిస్ప్లే కలిగిన ఫోన్ విడుదల చేసిన వివో..ఇప్పుడు నెక్స్ డ్యూయెల్ డిస్‌ప్లే ఎడిషన్ పేరిట రెండు వైపుల డిస్‌ప్లే కలిగిన ఫోన్ ను విడుదల చేయబోతుంది.  త్వరలో భారత్ మార్కెట్‌లోకి ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకరాబోతుంది. ఇక ఈ ఫోన్ ధర దాదాపు రూ.52,000గా ఉండొచ్చని అంచనా....

డ్యూఎల్ స్మార్ట్  ఫోన్ ఫీచర్లు:-

* ముందువైపు 6.39 అంగుళాల అల్ట్రా ఫుల్‌వ్యూ ఆమోల్డ్‌ డిస్‌ప్లే
* వెనుక భాగంలో 5.49 అంగుళాల సూపర్‌ ఆమోల్డ్‌ డిస్‌ప్లే 
* 10 జీబీ ర్యామ్‌, 128 జీబీ మెమరీ 
* గూగుల్ లేటెస్ట్ ఆం‍డ్రాయిడ్‌ ఓఎస్ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ 
* డ్యూయెల్‌ సిమ్‌ కార్డ్‌ 
* ఫోన్‌ వెనుక భాగంలో ట్రిపుల్‌ కెమెరా (12 ఎంపీ మెయిన్‌ కెమెరా + 2 ఎంపీ నైట్‌ విజన్‌ కెమెరా+ టీఓఎఫ్‌ 3డీ కెమెరా) 
* క్వాల్‌కామ్‌ ఫ్లాగ్‌షిప్ చిప్‌సెట్ స్నాప్‌డ్రాగన్‌ 845 ప్రాసెసర్‌ 
* 3,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ 
* ఫాస్ట్‌ చార్జింగ్‌ సపోర్ట్ ఫీచర్ 
* ఇన్‌-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ మొదలగు ఫీచర్లు ఈ ఫోన్ లో ఉన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: