ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ సంస్థ తాజాగా ఓ బంపర్ సేల్ ని ప్రారంభించింది. ఈ సరికొత్త సేల్ కి “ఫ్లిప్కార్ట్ ఫ్లిప్స్టార్ట్ డేస్” పేరుతో రేపటి నుంచీ అనగా జూన్ 1 నుంచీ ప్రారంభించ నుంది. జూన్ 1 న మొదలవుతున్న ఈ సేల్ జూన్ 3 వరకూ కొనసాగుతుందని సంస్థ తెలిపింది. ఈ మూడు రోజుల సేల్లో ఎలెక్ట్రానిక్ వస్తువలపై భారీగా ఆఫర్లు ఉండబోతున్నట్టుగా తెలిపింది.
ముఖ్యంగా హెడ్సెట్లు, ల్యాప్ట్యాప్లు, పవర్ బ్యాంక్లు, మొబైల్ కేస్లు మొదలగు వస్తువులపై 80 శాతం వరకూ రాయితీ ఉంటుందని సంస్థ ప్రకటించింది. అదేవిధంగా, సోనీ, జేబీఎల్ వంటి హెడ్సెట్లు, స్పీకర్స్ పై సుమారు 70 శాతం వరకూ డిస్కౌంట్ లభించనుండి.
హెచ్పీ, ఏసర్ లాంటి ల్యాప్ టాప్ ల ధరలు రూ.12,990 నుంచి మొదలు కానున్నాయని తెలుస్తోంది. పవర్ బ్యాంక్ లు, మొబైల్ . పవర్ బ్యాంకులు, మొబైల్ కేస్ లు ఇతర మొబైల్ కేస్లు, ఇతర మొబైల్ సంభందిత వస్తువులకి కనీస ప్రాంభధర రూ 99 నుంచీ మొదలవుతుందని తెలిపింది.