భారతదేశం లో కొత్తగా వచ్చిన టెలికాం ఆపరేటర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ తన మొబైల్ ఫోన్ సేవలకు చందాదారుల పరంగా భారతి ఎయిర్టెల్ను అధిగమించి రెండవ అతిపెద్ద ఆపరేటర్గా స్థానానికి చేరింది. జియో వచ్చాక ఆపరేటర్ల సంఖ్య 10 నుంది 6 కి చేరింది.
2016 సెప్టెంబరులో ఈ రంగంలోకి ప్రవేశించిన జియోలో 322.98 మిలియన్ల వినియోగదారులు మరియు 27.8% చందాదారుల మార్కెట్ వాటా ఉంది, ఎయిర్టెల్ కు 320.38 మిలియన్ల వినియోగదారులు మరియు మే చివరి నాటికి 27.6% మార్కెట్ వాటా ఉంది.
చందాదారుల సంఖ్య లో క్రియాశీల మరియు పనిచేయని సిమ్లు ఉంటాయి, రెండు రకాలు ఉన్నప్పటికీ టెలికాం రెగ్యులేటర్ ప్రతి సిమ్ను వినియోగదారుగా లెక్కిస్తుంది.
వోడాఫోన్ ఇండియా మరియు ఐడియా సెల్యులార్ మధ్య విలీనం నుండి పుట్టిన వోడాఫోన్-ఐడియా 387.55 మిలియన్ల వినియోగదారులతో మరియు 33.36% చందాదారుల మార్కెట్ వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.