ప్రస్తుత పరిస్దితుల్లో ప్రపంచంలో ఉన్న విషయాల గురించి మాట్లాడవలసి వస్తే.. అవి రెండే విషయాలు.. ఒకటి కరోనా వచ్చిన వారి గురించి.. రెండోవది కరోనా రాని వారి గురించి.. ఈ వైరస్ అంటిన వారు బ్రతకడానికి హస్పటల్లో జీవన పోరాటం చేస్తుంటే.. కరోనా రాని, పూటగడవని పేదలు ఎలా బ్రతకాలిరా దేవుడా అంటూ ఆకలితో పోరాటం చేస్తున్నారు.. మొదటి వారిది పునర్జన్మ కోసం తపన.. రెండోవారిది.. రేపటిలోకాన్ని చూడాలని పడే వేదన.. ఉన్న వాడు ఈ రోగాన్ని మోసుకువస్తే.. లేనివాడు నిత్యం నరకాన్ని అనుభవిస్తున్నాడు..
ఏది ఏమైనా ఇప్పుడు ఆస్తులు, అంతస్తులు, డబ్బు, నగలు ఇవేవి గుర్తుకు రావడం లేదు.. ఎలాగైనా బ్రతకాలి అనే పోరాటం తప్పితే మరేది కళ్లముందు లేదు.. ఇలాంటి సమయంలో ప్రజలందరు ఒక కఠినమైన విధానాన్ని అవలంభిస్తూ వీలైనంత త్వరగా మనదేశం నుండి ఈ రోగాన్ని తరమాలి అనే ఆలోచనతో జీవించాలి.. కాని ఇలా చేయడం లేదు.. చాలా మందిలో నిర్లక్ష్యం సృష్టంగా కనిపిస్తుంది.. దేశమంతా లాక్డౌన్ ప్రకటిస్తే కొందరు మాత్రం పాటించకుండా విచ్చల విడిగా రోడ్లమీద తిరుగుతున్నారు.. అందులో కొందరు అనాలోచిత పరులు మాస్క్ కూడా కట్టుకోకుండానే బయటకు వస్తున్నారు.. ఇప్పటికే పోలీసులు లాఠీలకు పని చెబుతుండగా.. మరి కొన్ని చోట్ల రూల్స్ను ఖచ్చితంగా అమలు చేస్తు బయటకు వచ్చిన వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు..
ఇదే కాకుండా తోచిన విధంగా పనిష్మెంట్ ఇస్తూ జనాల్లో మార్పు తేవడానికి ప్రయత్నిస్తున్నారు.. అయినా గాని ఎక్కడ వింటారండి.. ఇంట్లో కన్నవారి మాటలే చెవికెక్కించుకోని మనుషులున్న సమాజంలో ఒరేయ్ బాబు కరోనాతో చచ్చిపోతావురా అంటే పోతే పోనీ అంటారే తప్పా.. బాధ్యతతో ఆలోచించరు.. ఇకపోతే కొన్ని చోట్ల లాక్ డౌన్ రూల్స్ ను పట్టించుకోని వారికి పోలీసులు వినూత్న రీతిలో గుణపాఠాలు చెప్తున్నారు. అదెలా అంటే సైకిల్ పై వెళ్తున్న వారితో సైకిల్ మోయించడం, రోడ్డుపైకి వచ్చిన వారితో గుంజీలు తీయించడం చేస్తున్నారు. అయితే థానే పోలీసులు కొద్దిగా వినూత్నంగా ఆలోచించారు.
ఈ క్రమంలో పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘించి మార్నింగ్ వాక్ వెళ్తున్న వారిని ఆపగా, వీరికి ఫేస్ మాస్కు వేసుకున్న ఓ మహిళా పోలీసాఫీసర్ హారతి ఇచ్చి.. వినూత్నంగా లాక్ డౌన్ అవసరాన్ని గుర్తు చేయగా, మరో అధికారి లాక్ డౌన్ టైంలో బయటకొస్తే కరోనా ఎలా కబలించి వేస్తుందో.. కరోనా మంత్రం జపం చేస్తూ వివరించారు. అందర్ని ఆలోచింపచేసేలా ఉన్న ఈ వీడియో వైరల్గా మారి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మీరు చూసి ఎంజాయ్ చేయండి..
#WATCH: police perform 'aarti' of people who were out on the streets for morning walk amid #Coronaviruslockdown in thane, today. #Maharashtra pic.twitter.com/aqHk6SFZom
— ANI (@ANI) April 21, 2020