హీరో శర్వానంద్ టాలీవుడ్ హీరోలందరూ భిన్నమైన హీరో. ఏ సినిమా పడితే ఆ సినిమా చేయకుండా భిన్నమైన కథా నేపథ్యం ఉన్న సినిమాలు మాత్రమే చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే శర్వానంద్ కొత్త సినిమా వస్తుందంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని టాలీవుడ్ ప్రేక్షకులు భావిస్తారు. నటనకు ప్రాధాన్యమున్న సినిమాలు మాత్రమే చేస్తుంటారు శర్వానంద్. ఇప్పటికే భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. పడి పడి లేచే మనసు అంటూ డిఫరెంట్ లుక్ తో కనిపించిన శర్వానంద్... రణరంగం అంటూ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించాడు. అయితే రణరంగం సినిమాలు మిడిల్ ఏజ్ పర్సన్ గా  శర్వానంద్ నటన అందరినీ ఆకట్టుకుంది. రణరంగం సినిమాలో ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు. 

 

 

 

 అయితే  రణరంగం సినిమాలో  ఒక డిఫరెంట్ రోల్ లో  శర్వానంద్ నటించినప్పటికీ   అది ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో రణరంగం సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడి పోయింది. కాగా తాజాగా తమిళ హిట్ మూవీ 96 రీమేక్ లో శర్వానంద్ సమంత జోడిగా నటించిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం హీరో శర్వానంద్ శ్రీ కార్తీక్ దర్శకత్వంలో  ఓ సినిమాలో నటిస్తున్నారు. ఈ  సినిమాలో  శర్వానంద్ సరసన పెళ్లిచూపులు పేమ్ రీతువర్మ కథానాయకిగా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఇటీవలే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకుంది కూడా. కాగా  ఈ సినిమాలో సీనియర్ నటుడు నాజర్,  ప్రియదర్శి, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమాకి జాక్స్ బిజోయ్  సంగీతం అందిస్తున్నారు.

 

 

 

 తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో షెడ్యూల్ హైదరాబాద్లో ప్రారంభమైంది. డ్రీమ్ వారియర్  పిక్చర్స్  పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ మన్మధుడు నాగార్జున భార్య అక్కినేని అమల  శర్వానంద్ సినిమాలో  ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పెళ్లి చూపులు సినిమాకు  దర్శకుడి గా వ్యవహరించి  ప్రస్తుతం మీకు మాత్రమే చెప్తా సినిమాతో హీరోగా మారిన తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు. కాగా ఈ సినిమా వచ్చే సంవత్సరం వేసవిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. అయితే వరుస ఫ్లాపులతో ఉన్న శర్వానంద్ కు ఈ సినిమా  హిట్ ఇస్తుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: