మితిమీరిన వేగం అమాయకుల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ తరహా ఘటనలు మహా నగరాలు అయిన హైదరాబాద్ లాంటి వాటిల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. మితిమీరిన వేగంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపడం కూడా ప్రమాదాలకు తావు ఇస్తోంది.  తాజాగా ఇలాంటి ఒక ఘటన హైదరాబాద్ లో జరిగింది హైదరాబాద్ బయో డైవర్శిటీ ఫ్లైఓవర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఫ్లైఓవర్‌పై వెళ్తున్న ఓ కారు అదుపు తప్పి కింద రోడ్డుపై వెళ్తున్న మరో కారుపై పడింది. ఆ సమయంలో అక్కడే ఆటోకోసం వేచి చూస్తున్న మహిళ ఈ ప్రమాదంలో అక్కడికక్కడే మృతిచెందింది.మృతిచెందిన మహిళ సత్యవేణిగా గుర్తించారు.ఈ దుర్ఘటనలో మరో ఆరుగురు తీవ్రగాయాల పాలయ్యారు. కార్ మితిమీరిన వేగంతో ప్రయాణించడం అదుపు తప్పి ఫ్లైఓవర్‌ పైనుంచి పల్టీలు కొట్టుకుంటూ కింద పడింది. 

ప్రమాద సమయంలో కారులో ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. ఫ్లైఓవర్ కింద ముగ్గురు వ్యక్తులు ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఆరుగురు వ్యక్తులు ఈ ప్రమాదంలో గాయపడినట్లు చెబుతున్నారు. ఈ వారంలో బయో డైవర్సిటీ ఫ్లై ఓవర్ మీద ఇది రెండో ప్రమాదం జరిగింది. ఇంతకు ముందు జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరోవైపు కారు ప్రమాదంతో బయో డైవర్శిటీ ఫ్లైఓవర్ వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రమాదస్థలంలో చెట్లు విరిగిపడ్డాయి.‌కారుతో పాటు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ప్రమాదంతో బయో డైవర్శిటీ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణం మితిమీరిన వేగమేనని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక గాయ పడిన క్షతగాత్రులను దగ్గరలోని ఆస్పత్రి లో చేర్చారు. ఇక ప్రమాదానికి కారణమైన వ్యక్తులు మద్యం సేవించి కారు నడిపారా?  అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: