బాదం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చిన్న పిల్లలకు రాత్రి పూట బాదం నానబెట్టి ఉదయాన్నే ఇస్తే చాలా మంచిది మెదడు చురుకుగా పనిచేస్తుంది. బాదం మీగడ పాయసం మన మనస్సుకి ఎంతో నచ్చే తీపి వంటకం, కుంకుమపువ్వు వాసన, బాదంతో నిండిన, ఘుమాయించే భారతీయ దినుసులతో కూడిన ఒక చెంచా అన్నం పరమాన్నం కన్నా రుచిగా ఏముంటుంది? మనకి పాయసం లేదా పరమాన్నం ప్రతి పండగకీ, ఉత్సవాలకి తప్పనిసరి వంటకంగా మారిపోయింది. మనం బాదం మీగడ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.ఈ ప్రత్యేక బాదం మీగడ పాయసం రెసిపి ఏ పండగకైనా బావుంటుంది, దీన్ని వండటానికి కూడా పెద్ద సమయం పట్టదు.
కావలసిన పదార్ధములు...చక్కెర -1 చెంచా, పొట్టు తీసేసిన బాదం -2 చెంచాలు, బాస్మతి బియ్యం -2 చెంచాలు, ఆకుపచ్చని ఏలకుల పొడి- 1చెంచా, కుంకుమ పువ్వు- కొన్ని రేకులు, పాలు -350గ్రా, గట్టిపడిన పాలు -4 చెంచాలు.
తయారు చేయు విధానం... .ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యం పోయండి. నీళ్ళు పోసి 10-15 నిమిషాలు నాననివ్వండి. ఒక పెనం తీసుకోండి. పాలు పోసి 5-10నిమిషాలు మరగనివ్వండి. నానిన బియ్యాన్ని పోసి బాగా కలపండి. అన్నాన్ని 4-5 నిమిషాలు ఉడకనివ్వండి. అన్నం మెత్తగా ఉన్నప్పుడు, గట్టిపడిన పాలను అందులో పోయండి. బాదంపప్పులు, ఆకుపచ్చని ఏలకుల పొడి మరియు చక్కెరను దానిలో వేయండి. 2-3 నిమిషాల పాటు కలపండి. పెనం దించేసి, అందరికీ వడ్డించేముందు కుంకుమపువ్వుతో అలంకరించండి.
ఇలా చేసుకుని తింటే ఆహా రుచికి రుచి పిల్లలకు పెద్దలకు బాదం ఎంతో మంచిది. చాలా మంది బాదం పప్పు తింటే శరీరంలో కొవ్వు శాతం పెరుగుతుంది అనుకుంటారు. కానీ బాదం వల్ల ఎటువంటి కొవ్వు పెరగదని నిపుణులు చెపుతున్నారు.