తన భర్తతో ఇతర  ఉద్యోగినులకు అక్రమసంబంధం ఉందన్న అనుమానంతో భార్య నరకం చూపించింది. ఇంతకీ విషయం ఏమిటంటే సూర్యాపేటలో ఓ మల్టీ స్పెషాలిటి ఆసుపత్రి ఉంది. అందులో భార్య భర్తలు రామకృష్ణ, విజయలక్ష్మిలు ఇద్దరు డాక్టర్లే. అంటే ఆసుపత్రి వారిదే కాబట్టి మొత్తం పర్యవేక్షణ అంతా డాక్టర్లిద్దరే చూసుకుంటున్నారు.

 

అయితే ఇదే ఆసుపత్రిలో కొందరు నర్సులు కూడా పనిచేస్తున్నారు. నర్సులన్నాక ఆడ, మగా ఇద్దరూ ఉంటారు కదా. ఇందులో భాగంగానే ఆసుపత్రిలో సునీత, ప్రమీల, ఆండాళ్ తో పాటు మరికొందరు నర్సులు పనిచేస్తున్నారు. వీరిలో కొందరితో తన భర్త రామకృష్ణకు అక్రమ సంబంధాలున్నాయని విజయలక్ష్మికి అనుమానం వచ్చింది. నర్సులతో రామకృష్ణ సన్నిహితంగా ఉండటంతో భార్య విజయలక్ష్మికి అనుమానం మరింత పెరిగిపోయింది.

 

దాంతో తరచూ నర్సులకు, డాక్టర్ విజయలక్ష్మికి మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఇదే నేపధ్యంలో డాక్టర్ రామకృష్ణ ఊరిలో లేని సమయం చూసుకుని సునీత, ప్రమీల అనే నర్సులను తన గదిలోకి పిలిపించుకుని నానా గొడవ చేసింది. వాళ్ళిద్దరినీ కుర్చీలకు కట్టేసి వాళ్ళను సూదులతో బాగా గుచ్చేసింది. మెడపై కత్తులు పెట్టి తన భర్తతో అక్రమ సంబంధం ఉందని ఒప్పుకోవాలని ఒత్తిడి పెట్టింది.

 

సూదులతో గుచ్చటం, మెడపై కత్తిపెట్టి బెదిరించటంతో నర్సుల్లో టెన్షన్ పెరిగిపోయింది. తమకు డాక్టర్ రామకృష్ణకు ఎటువంటి సంబంధం లేదని మొత్తుకున్నా విజయలక్ష్మి అంగీకరించలేదు. దాంతో వాళ్ళు నెత్తి నోరు మొత్తుకున్నా ఉపయోగం కనబడలేదు. ఈ విషయం మిగిలిన నర్సులకు తెలిసినా ఎవరూ ఏమీ నోరెత్తలేదు.

 

వాళ్ళని శారీరకంగా బాగా హిసించిన విజయలక్ష్మి కొద్దిసేపు బయటకు వెళ్ళిందట. దాంతో మిగిలిన నర్సులు వెంటనే సహచర నర్సులను బంధించిన గదిలోకి వెళ్ళి వాళ్ళ కట్లువిప్పి బయటకు తీసుకెళ్ళిపోయారు. గదిలో నుండి బయటపడిన నర్సులిద్దరు బతుకు జీవుడా అనుకుని వెంటనే పోలీసు స్టేషన్ కు వెళ్ళారు.  డాక్టర్ విజయలక్ష్మిపై నర్సులిద్దరూ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: