ప్రియుడు ని మర్చిపోలేక దెయ్యం పట్టింది అని నాటకం!!!! చివరకి హిజ్రా చేతిలో చావు దెబ్బలు తింది.. దెయ్యo అంటే భయపడని వారు ఎవరు ఉండరు.. చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ దాక అందరిని భయం తో బెంబేలు పెట్టిస్తుంది.. అసలు దెయ్యం ఉందో లేదో అన్నా విషయం పక్కనబెడితే దెయ్యం పేరు వింటే చాలు ఒణుకు పుడుతుంది అందరికి. దేవుడు ఉన్నది ఎంత నిజమో దెయ్యం ఉన్నది అంతే నిజమని నమ్ముతారు ప్రజలు..

 


అలాంటి ఒక నమ్మకంతో ఒక యువతీని దారుణంగా కొట్టారు.. ఈ సంఘటన తమిళనాడులోని సేలంజిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. సేలం జిల్లాలోని ఓ ప్రాంతానికి చెందిన యువతికి వింతగా ప్రవర్తించడంతో దెయ్యం పట్టిందేమోనని ఆమె తల్లిదండ్రులు ఆందోళన పడ్డారు.

 

ఆమెను గత వారం సేలం కన్నంగురిచ్చి ప్రాంతంలో ఉన్న శ్రీ మదురకాళియమ్మన్‌ ఆలయంలో జ్యోతిష్యం చెప్పే హిజ్రా మధుర వద్దకు తీసుకెళ్లారు... అమ్మాయి ప్రవర్తన వింతగా ఉంటుందని, పిచ్చి పిచ్చి చేష్టలు, పిచ్చి పిచ్చిగా మాట్లాడం లాంటివి చేస్తుందని దెయ్యం పట్టింది విడిపించమని హిజ్రా మధుర ని సంప్రదించారు.

 


మధుర ఆ యువతిని కొన్ని ప్రశ్నలు అడిగి, తన ప్రవర్తన పరిశీలించి ఒక్కసారిగా గట్టిగా వెళ్ళిపో అని అరుస్తూ, జుట్టుపట్టుకుని కర్రతో కొట్టడం మొదలుపెట్టింది. ఇది అంతా కన్న తల్లిదండ్రులు చూస్తుండగానే జరిగింది... వాళ్ళు ఏమి మాట్లాడలేదట.. హిజ్రా మధుర కొట్టె దెబ్బలు తట్టుకోలేక ఆ యువతీ నిజం చెప్పింది..
ఆ యువతీ చెప్పిన సమాధానం విని అందరు షాక్ కి గురిఅయ్యారు..

 


ఆ యువతీ మధురతో చెపింది ఏమంటే "నేను ఒక  అబ్బాయిని ప్రేమిస్తున్నాను.... అతన్ని పెళ్లి చేసుకోడానికి ఇలా నాటకం ఆడుతున్న అంది" దీనితో మధుర ఆ ప్రేమించిన అబ్బాయిని మర్చిపోవాలంటూ ఒక 10 నిముషాలు పాటు కొట్టింది.. దెబ్బలు బరించలేక ఆ యువతీ ప్రేమించిన అబ్బాయిని మర్చిపోతా అని చెప్పింది.. అపుడు కొట్టడం ఆపేసింది.

 

ఈ మొత్తం సంఘటన కి సంబంధిచిన వీడియోని మధుర సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఆ వీడియో కాస్త నెట్ లో వైరల్ కావడంతో మధురకి బెదిరింపులు మొదలు అయ్యాయి. ఈ వీడియో ని యువతీ తండ్రి అనుమతి తోనే సోషల్ మీడియాలో పోస్ట్ చేసానని తెలిపింది.. రక్షణ కోసం పోలీస్ లకు వినతిపత్రం అందచేశానని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: