అందమైన భవనాల్లో జోరుగా సాగే చీకటి వ్యాపారం, అనైతిక కార్యకలాపాల గురించి బయటి ప్రపంచానికి తెలియదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సంపాదనకు అలవాటుపడిన కొందరు నిర్వాహకులు ఇలాంటి సెంటర్లును తెరుస్తున్నారు. అయితే తాజాగా హైటెక్ వ్యభిచార ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. స్పాలు, మసాజ్ సెంటర్ల పేరుతో విచ్చలవిడిగా నడుస్తున్న ఈ దందాకు పోలీసులు చెక్ పెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. విదేశీ అమ్మాయిలను రప్పించి వారితో వ్యభిచారం చేయిస్తున్న ముఠాను పంజాబ్ రాజధాని అమృత్సర్లో పోలీసులు అరెస్ట్ చేశారు.
నగరంలోని సివిల్ లైన్ పోలీస్స్టేషన్ పరిధిలోని పలు స్పా సెంటర్లపై దాడులు చేసిన పోలీసులు 26 మంది సెక్స్వర్కర్లను అరెస్ట్ చేశారు. అయితే వీరిలో 12 మంది విదేశాలకు చెందిన బాలికలే ఉన్నారు. ఈ క్రమంలోనే విదేశీ యువతుల నుంచి పాస్పోర్ట్లు స్వాధీనం చేసుకున్నారు. మసాజ్ సెంటర్లలో ఉద్యోగాల పేరుతో వీరిని రప్పించిన నిర్వాహకులు ఎక్కువ డబ్బు ఆశ చూపించి వ్యభిచారం చేయిస్తున్నట్లు గుర్తించారు. బాడీ మసాజ్ పేరుతో ఏర్పాటు చేసిన స్పా, మసాజ్ సెంటర్లకు వచ్చే కస్టమర్లకు అందమైన యువతులతో ఎర వేస్తారు.
థాయ్లాండ్, బంగ్లాదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మలేషియా, నేపాల్, భూటాన్, నార్త్ ఇండియా, హైదరాబాద్తోపాటు గుంటూరు, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి అందమైన యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, ఇలా కొందరు నిర్వాహకుల చేతిలో ఎంతోమంది యువతులు మగ్గిపోతారు. అధిక జీతం ఇస్తామని ఆశ చూపించి వారి జీవితాలతో ఆడుకుంటారని, వారి ప్రలోభాలకు లొంగని అమ్మాయిల నుంచి పాస్పోర్టులు, వీసాలు లాక్కుని బెదిరించి బలవంతంగా విటుల దగ్గరకు పంపిస్తున్నారని వెల్లడించారు.