కావాల్సిన పదార్థాలు:
క్యాబేజీ తురుము- ఒక కప్పు
పచ్చిమిర్చి- ఆరు
ఎండుమిర్చి- ఐదు
ఆవాలు- అర టీ స్పూన్
నూనె- తగినంత
ఉప్పు- తగినంత
జీలకర్ర- అర టీస్పూన్
ఇంగువ- చిటికెడు
పసుపు- పావు టీ స్పూను
చింతపండు పులుసు- పావు కప్పు
మినప్పప్పు- ఒక టీ స్పూన్
శనగపప్పు- ఒక టీ స్పూన్
తయారీ విధానం:
ముందుగా ఒక బాణలిలో నూనె పోసి వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు వేసి రెండు నిమిషాలు వేగించాలి. ఇవి వేగక ఇంగువ, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, క్యాబేజీ తురుము వేసి బాగా వేగించాలి. ఇప్పుడు క్యాబేజీ సగం ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేయాలి.
ఇక ఈ మిశ్రమాన్ని చల్లారనిచ్చి చింతపండు పులుసు పోసి మెత్తగా రుబ్బుకోవాలి. చివర్లో పోపు పెట్టుకుంటే సరిపోతుంది. అంతే టేస్టీ టేస్టీ క్యాబేజీ చట్నీ రెడీ. వేడి వేడి రైస్లో ఈ చట్నీ వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో.. తప్పకుండా ట్రై చేయండి.