కీరదోసకాయ రసంలో దూదిని ముంచి రోజుకి రెండుసార్లు రాసుకుంటే చర్మానికి మెరుపు వస్తుంది.  క్లెన్సింగ్ కూడా చర్మ సంరక్షణలో ఒక ప్రధానమైన చర్య. క్లెన్సింగ్ అప్లై చేసి ఒక నిముషంపాటు వదిలేసి తరువాత శుభ్రపరచుకుంటే దుమ్ము, ధూళి అంతా పోయి చర్మం ఎలాంటి ముడుతలూ లేకుండా తాజా పండులా తయారవుతుంది. మేకప్‌కు కూడా ఎంతో సహకరిస్తుంది.  ఖరీదైన స్కిన్ టోనర్లకు బదులుగా చర్మానికి నిమ్మకాయ రసాన్ని వాడండి.  చర్మం పై పొరను పరిశుభ్రపరచడానికి ఒక మెరుపులాంటి ఛాయను ఇవ్వడానికి మాయిశ్చరైజింగ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎప్పుడో ఎవరో చెప్పినప్పుడు అని కాకుండా క్రమం తప్పకుండా మాయిశ్చరైజ్ చేసుకోవాలి.  జిడ్డు చర్మం ఉన్నవారికి టమోటాలు చాలా బాగా ఉపయోగపడతాయి. టమోటాని సగానికి కోసి ముఖనికి చేతులకు రుద్ది పావు గంట తర్వాత కడిగేయాలి. చర్మం శుభ్రపడుతుంది బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. చర్మ రంద్రాలు శుభ్రపడతాయి. తాజా బొప్పాయిలో కొబ్బరిపాలు కలిపి, చర్మానికి రాసుకుంటే చర్మం మృదువుగా శాటిన్ లా మెత్తగా మారుతుంది.  దోమలు కుడితే నిమ్మరసంకు కొంచెం నీరు కలిపి దూదితో దోమ కుట్టిన చోట రుద్దితే మంట తగ్గిపోతుంది.  నారింజ రసం తీసుకోండి...  దానికి పాలు కలిపి ముఖానికి చేతులకు పట్టించండి. నెల రోజుల పాటు క్రమం తప్పకుండా ఇలా చేస్తే మచ్చలు, చర్మ సంబంధ సమస్యలు మాయమవుతాయి. యుక్తవయసులోని వారు ఎండలో వెళ్ళేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ వాడటం, గొడుగు, టోపీ వాడటం అలవాటు చేసుకోవాలి. అలాగే ఈ వయసు నుంచి ఒక చిటికెడు పసుపు, ఒక టేబుల్ స్పూను పాలపొడి, రెండు స్పూన్ల తేనె, సగం నిమ్మకాయ రసం ఇవన్నీ కలిపి మిశ్రమంగా తయారుచేసి మొహానికి రాసుకొని ఆరే వరకు అలాగే ఉంచుకొని తరువాత గోరువెచ్చని నీటితో మొఖాన్ని కడిగేయాలి. దీనివల్ల చర్మం బాగా శుభ్ర్రపడటమే కాక రక్తప్రసరణ మెరుగవుతుంది.   ావుకప్పు ఓట్లు, పాలపొడి, చిక్కటి గంజి తీసుకోవాలి. వీటన్నిటినీ పేస్టులా కలుపుకోవాలి. స్నానానికి ఇరవై నిముషాలముందు శరీరమంతా పట్టించుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చటి నీటితో స్నానం చేయాలి.  పోషక విలువలున్న ఆహార పదార్ధాలతో సమతుల ఆహారం తీసుకుంటే అది చర్మానికి అందాన్ని ప్రసాదించడమే కాకుండా అనేక చర్మసంబంధిత వ్యాధులకు గురికాకుండా రక్షిస్తుంది.   వేడి నీటితో స్నానం చేయటం మంచి పద్దతి కాదు. ఇలా చెయటం వల్ల చర్మం మరింత పొడిగా మారుతుంది.  మాయిశ్చరైజర్ ఉన్న సబ్బును వాడాలి. స్నానం చేసిన అనంతరం మాయిశ్చరైజ్ లోషన్‌ను పూసుకుంటే చర్మానికి చల్లదనాన్ని అందిస్తుంది.  మీ చర్మం ముడతలు, పగుళ్ళు గా ఉన్నట్లయితే మీరు మీ చర్మాన్ని సంరక్షించుకోవాలి. మొదట ఒక మంచి చర్మ వ్యాధుల నిపుణుని కలవండి. మీకున్న సమస్య చిన్నదేనా లేదా ప్రమాదకరమైనదా అనేది నిర్ధారించుకోవాలి. క్రమం తప్పకుండా ఫేషియల్స్, క్లీనప్స్ చేయించుకుంటుంటే మంచిగా చర్మాన్ని సంరక్షించుకోవాలి.  వారాని కొక్కసారి తప్పనిసరిగా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి.   వీలైనన్ని తాజా పళ్ళూ, కూరగాయలను ఆహారంలో తీసుకోండి. రోజులో వీలైనంత మంచినీరు తాగడానికి ప్రయత్నించండి.   వెల్లుల్లి రసం తెగిన, కాలిన గాయలను, మచ్చలను తగ్గిస్తుంది.  శ్వాసక్రియకు సంబంధించిన వ్యాయామం చేయడం కూడా చర్మసౌందర్యానికి ఉపకరిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  స్నానానికి బాగా వేడిగా లేదా చల్లగా ఉన్న నీళ్ళను వాడటం దాదాపుగా ఆపేయాలి. గోరు వెచ్చని లేదా మామూలుగా చల్లగా ఉండే నీళ్ళను వాడటం క్షేమం.   ఆస్ట్రిజంట్: దీనిని జిడ్డుచర్మం కలవాళ్ళు ఉపయోగించాలి. ఆస్ట్రిజంట్ వాడితే చర్మంలో ఉన్న నూనె శాతం తగ్గి తాజా అనుభూతి కలుగుతుంది.   కాలమైన్‌లోషన్: దీనిని అన్ని కాలాల్లో ఉపయోగించవచ్చు. ముఖ్యంగా వేసవికాలంలో చర్మాన్ని ఎండబారి నుండి రక్షిస్తుంది.   సాధారణ చర్మం: ఈ చర్మం కలవారు గంధంతో కూడిన సబ్బులు, లావెండర్ సబ్బులు వాడాలి. పొడి చర్మం అయితే ఇలా చేయాలి    ఎండ వల్ల కమిలిపోయిన చర్మాన్ని పండబారిన టమోటాలతో రుద్దితే బాధ తొలగడంతో పాటు చర్మం మెత్తబడుతుంది.   ఎప్పుడూ కాటన్ దగ్గర పెట్టుకొని ముఖాన్ని తుడుచుకుంటూ ఉండాలి. లేదంటే బ్యాక్టీరియా చాలా తొందరగా ఈ చర్మం పై చేరుతుంది.  వయసు ప్రభావం వల్ల, చర్మం పలుచదనం వల్ల తొందరగా సూర్యకిరణాల తాకిడికి, పొగకు, కాలుష్యానికి ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పొడిచర్మం ఉన్నవారిలో లోపల ఉన్న తేమకూడా త్వరగా ఆవిరైపోతుంది. కాబట్టి అలాంటి చర్మం కలవారు వెంటనే మాయిశ్చరైజ్ చేయించుకోవాలి.   కాచిన పాలలో కొద్దిగా నిమ్మ రసం కలిపితే ఆ మిశ్రమం చక్కని బ్లీచింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఆ మిశ్రమాన్ని మెడకు, చేతులకు పట్టించి ఎండనివ్వాలి. ఆ తరువాత దాన్ని వెచ్చని నీటితో కడిగితే చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.    నూనె, నీరు కొన్ని ఇతర ఔషధాలు కలిపిన ద్రవపదార్ధంతో మాయిశ్చరైజ్ చేసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది చర్మ సంరక్షణలో ప్రధాన పాత్రను పోషిస్తూ ముడుతలు, పొడిబారటం, మంట, పగుళ్ళు లేకుండా చేయడంతోపాటు చర్మానికి ఒక ఆరోగ్యమైన సహజసిద్దమైన మెరుపును అందిస్తుంది.     పెరుగులో బియ్యం పిండిని కలిపి స్నానం చేస్తే శరీరం పగుళ్లు, పొడిబారటం తగ్గి కాంతివంతంగా మారుతుంది.    పొడి చర్మం ఉన్న వాళ్ళు కొన్నాళ్ళ పాటు రోజూ రాత్రి పూట ఆముదంతో చర్మాన్ని మర్ధన చేసుకుంటే చర్మం క్రమంగా మృదువుగా మారుతుంది.     పొడిచర్మం: ఈ చర్మం కలవారు గ్లిజరిన్‌తో కూడిన సబ్బులు వాడాలి.    మాయిశ్చరైజర్: దీనిని పొడి, సాధారణ చర్మం గల వాళ్ళు వాడాలి. చర్మం ముడతలు పడటాన్ని నిరోధించి, చర్మ మృదుత్వాన్ని కాపాడుతుంది.   రాత్రిళ్ళు స్నానం చేశాక మాయిశ్చరైజర్ తీసుకుని చర్మంలోకి బాగా ఇంకేలా మర్దన చేయాలి. అలా చేస్తే నిద్ర పోయేటప్పుడు రక్త సరఫరా బాగా జరిగి తెల్లారేసరికి చర్మం తేటగా ఉంటుంది.   వాక్సింగ్ అనంతరం బాడీ లోషన్ లేదంటే అలోవెరా జెల్ రాసుకోవాలి. అందులోని సహజ కూలింగ్‌లక్షణం చర్మాన్ని సేదదీరుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: