ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్ పలు కీలక సూచనలు చేశారు. లాక్డౌన్ విషయంలో కొన్ని సడలింపులు చేయాలని,రెడ్జోన్లలో మినహా.. మిగతా ప్రాంతాల్లో సడలింపు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ సూచించారు. కోవిడ్ -19 ప్రభావం, పరిణమాలపై 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ పలు విషయాలను మోడీకి దృష్టికి తీసుకెళ్లారు. వ్యవసాయం, నిత్యావసర సరుకుల తరలింపు విషయంలో సడలింపు ఇవ్వాలని ఆయన సూచించారు. అయితే.. కేంద్రం నిర్ణయంతో సంబంధం లేకుండా స్వల్ప సడలింపులతో లాక్డౌన్ను పొడిగించేందుకు సీఎం జగన్ మొగ్గుచూపతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి వచ్చే మూడు నాలుగు వారాలు అత్యంత కీలకమపి చెప్పారు.
అయితే.. ఇదేసమయంలో తెలంగాణ ముఖ్యమంత్రితోపాటు మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్ తదితర రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఒకే విధమైన లాక్డౌన్ను అమలుచేయాలని సూచించారు. నిజానికి.. కేంద్రం నిర్ణయంతీ సంబంధం లేకుండా ఇప్పటికే పలు రాష్ట్రాలు లాక్డౌన్ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఒడిశా, పంజాబ్,కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నాయి. అయితే.. ఏపీలో మాత్రం ముఖ్యమంత్రి జగన్ కొన్ని సడలింపులతో లాక్డౌన్ అమలు చేసేందుకు మొగ్గుచూపే దిశగా ఉన్నారని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. రెడ్జోన్లలో కాకుండా మిగతా ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని జగన్ కోరారు. కాగా, ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీ సూచించారు. ఇదే సమయంలో రెడ్జోన్లలో మరింత కఠినంగా నియమాలను అమలు చేయాలని ఆయన సూచించారు.