భారత్లో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకూ ఎక్కువ అవుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఈ మహమ్మారి రోజురోజుకూ కొత్తకొత్త ప్రాంతాలకు వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు కొవిడ్-19 పాజిటివ్ కేసుల సంఖ్య 13,835కు చేరుకుంది. మరణాలు 452 సంభవించాయి. ఇక మహారాష్ట్రలో 3,320 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దేశంలోనే మహారాష్ట్ర పాజిటివ్ కేసుల సంఖ్యలో మొదటి స్థానంలో ఉంది. ఇందులో ముంబైలోనే అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. ఇక ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య 1700కు చేరువలో ఉంది.
ఆ తర్వాత తమిళనాడు, రాజస్తాన్, తదితర రాష్ట్రాల్లోకరోనా వైరస్ ప్రభావం ఎక్కుగానే కనిపిస్తోంది. గుజరాత్లో కూడా పాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్క్ను దాటిపోయింది. ఈ గణాంకాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనావైరస్ మరణాల సంఖ్య 149,000ను దాటిపోయింది. ఒక్క యూరప్లోనే దాదాపు మూడింట రెండు వంతుల మరణాలు సంభవించాయని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా 2.2 మిలియన్లకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.