టాలీవుడ్లో *బీ ద రియల్ మ్యాన్* ఛాలెంజ్కు అనూహ్య స్పందన లభిస్తోంది. లాక్డౌన్ కారణంగా ఇళ్లకే పరిమితం అయిన సెలబ్రిటీలు ఇందులో పాల్గొంటున్నారు. హీరోలు, దర్శక నిర్మాతలు ఇతర ప్రముఖులు ఈ ఛాలెంజ్ను ఉత్సాహంగా స్వీకరిస్తున్నారు. నిన్న జూనియర్ ఎన్టీఆర్ విసిరిన బీ ద రియల్ మ్యాన్ సవాల్ను మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంకటేశ్లు స్వీకరించారు. ఈ రోజు ఉదయం పదిగంటల సమయంలో చిరంజీవి తాను చేసిన ఇంటి, వంట పనుల వీడియోను పోస్ట్ చేశారు. ఆ తర్వాత వెంకటేశ్ కూడా చాలెంజ్ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలను చూసిన హీరోయిన్ నికేషా పటేల్ స్పందించారు. టాలీవుడ్ నటులు చేస్తున్న ఇంటి పనులు చేయడం, దుమ్ము దులుపడం.. వంటలు చేయడం ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు.
ముఖ్యంగా చిరంజీవి, వెంకటేశ్లపై ప్రశంసలు కురిపించిందీ ఈ అమ్మడు. దీనిని ఇలాగే కొనసాగించండి.. అంటూ ట్వీట్ చేసింది. కాగా, పవన్తో కలిసి నికేషాపటేల్ కొమురంపులిలో నటించిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు.. చాలా కాలం తర్వాత టాలీవుడ్ స్టార్ హీరోల మనసులో పడేందుకు బాగానే ప్రయత్నాలు చేస్తుందన్నమాట. దీనికి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి మరి.
Nice to see all the telugu make stars do jhadoo pocha dishes and dusting and cooking! Hilarious to see and the most adorable was venkatesh sir and chiranjivi sir! Keep it up! @KChiruTweets @VenkyMama this is the best challenge in times!
— Nikesha patel (@NikeshaPatel) April 23, 2020