టాలీవుడ్‌లో *బీ ద రియ‌ల్ మ్యాన్* ఛాలెంజ్‌కు అనూహ్య స్పంద‌న ల‌భిస్తోంది. లాక్‌డౌన్ కార‌ణంగా ఇళ్ల‌కే ప‌రిమితం అయిన సెల‌బ్రిటీలు ఇందులో పాల్గొంటున్నారు. హీరోలు, ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇత‌ర ప్ర‌ముఖులు ఈ ఛాలెంజ్‌ను ఉత్సాహంగా స్వీక‌రిస్తున్నారు. నిన్న జూనియ‌ర్ ఎన్టీఆర్ విసిరిన బీ ద రియ‌ల్ మ్యాన్ స‌వాల్‌ను మెగాస్టార్ చిరంజీవి, హీరో వెంక‌టేశ్‌లు స్వీక‌రించారు. ఈ రోజు ఉద‌యం ప‌దిగంట‌ల స‌మ‌యంలో చిరంజీవి తాను చేసిన ఇంటి, వంట ప‌నుల వీడియోను పోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత వెంక‌టేశ్ కూడా చాలెంజ్ వీడియోను ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోల‌ను చూసిన హీరోయిన్ నికేషా ప‌టేల్ స్పందించారు. టాలీవుడ్ న‌టులు చేస్తున్న ఇంటి ప‌నులు చేయ‌డం, దుమ్ము దులుప‌డం.. వంట‌లు చేయ‌డం ఎంతో ఉల్లాసంగా అనిపిస్తుందంటూ ట్వీట్ చేశారు.

 

ముఖ్యంగా చిరంజీవి, వెంక‌టేశ్‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపించిందీ ఈ అమ్మ‌డు. దీనిని ఇలాగే కొన‌సాగించండి.. అంటూ ట్వీట్ చేసింది. కాగా, ప‌వ‌న్‌తో క‌లిసి నికేషాప‌టేల్ కొమురంపులిలో న‌టించిన విష‌యం తెలిసిందే. ఈ అమ్మ‌డు.. చాలా కాలం త‌ర్వాత‌ టాలీవుడ్ స్టార్ హీరోల మ‌న‌సులో ప‌డేందుకు బాగానే ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌న్న‌మాట‌. దీనికి రిప్లై ఎలా ఉంటుందో చూడాలి మ‌రి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: