ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాలం నడుస్తోంది. వివిధ దేశాల ప్రధానులతో పాటు చాలా మంది నేతలు కరోనా టెస్టులు చేయించుకునేందుకు ముందుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కరోనా టెస్ట్ చేయించుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. జిల్లాల వారీగా కరోనా టెస్టులు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లు విజయనగరం జిల్లాకు చేరుకున్నాయి.
1680 ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను సర్కార్ ఈ జిల్లాకు పంపించింది. దీనిలో భాగంగా డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెకు నెగిటివ్గా నిర్ధారణ అయింది. ఇక కరోనా నేపథ్యంలో పలువురిని మోటివేట్ చేస్తోన్న శ్రీవాణి కొద్ది రోజుల క్రితం ఆవకాయ పచ్చడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కరోనాపై సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ :
NIHWN వారి సంజీవన్ మీకు కల్పిస్తోన్న ఈ అవకాశం.. కరోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకోండి.
Google: https://tinyurl.com/NIHWNgoogle
apple : https://tinyurl.com/NIHWNapple