మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ యేడాది సంక్రాంతికి అల్లు అర్జున్తో అ వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తెరకెక్కించాడు. బాహుబలి తర్వాత నాన్ బాహుబలి రికార్డులు అన్నింటిని తిరగరాసిన ఈ సినిమా దెబ్బతో ఇప్పుడు త్రివిక్రమ్ క్రేజ్ మామూలుగా లేదు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ ఎన్టీఆర్తో చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేసే సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్. అరవింద సమేత తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది.
పాన్ ఇండియా సినిమాగా దీనిని తెరకెక్కించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారని.. ఈ క్రమంలోనే తమిళ్, హిందీ భాషల్లో తెలిసిన హీరోయిన్ అయితే బాగుంటుందని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ క్రమంలోనే ముందుగా దివంగత అందాల తార శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్ .. పూజ హెగ్డే పేర్లు వినిపించాయి. తాజాగా శ్రుతి హాసన్ పేరు తెరపైకి వచ్చింది. ఒక కథానాయికగా ఆమెను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో వీరిద్దరు రామయ్యా వస్తావయ్య సినిమాలో చేశారు. ఆ సినిమా ప్లాప్ అయ్యాక.. శృతిని కొందరు ఐరెన్లెగ్ అని విమర్శలు చేశారు. మళ్లీ ఇప్పుడు ఎన్టీఆర్ శృతిని ఓకే చేస్తాడా ? అన్నది చూడాలి.