నూతన చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా సంజయ్ కొఠారి ప్రమాణ స్వీకారం చేశారు. శనివారం రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. రామ్ నాథ్ కోవింద్ కార్యదర్శిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ కొఠారి శనివారం కొత్త చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ( సివిసి ) గా ప్రమాణ స్వీకారం చేసినట్లు రాష్ట్రపతి భవన్ తెలిపింది. హర్యానాకు చెందిన 1978 బ్యాచ్కు చెందిన అధికారి కొఠారి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని హైపవర్ కమిటీ కొత్త సివిసిగా ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో సోషల్ డిస్టన్స్ పాటించారు. హాజరైన వారందరూ దూరందూరంగా కూర్చుకున్నారు. చీఫ్ విజిలెన్స్ కమిషనర్ ( సివిసి ) పదవి జూన్ 2019 నుండి ఖాళీగా ఉంది. అయితే.. లోక్సభలో కాంగ్రెస్ ఫ్లోర్ నాయకుడు, ప్రధానమంత్రి మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సెలక్షన్ ప్యానెల్లో ఉన్న అధికర్ రంజన్ చౌదరి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించారు. సివిసిని నియమించే ప్రక్రియను చట్టవిరుద్ధం, రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ గతంలోనే విమర్శించింది. వెంటనే నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసింది.