మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం లాక్‌డౌన్ వేళ సినీ కార్మికుల‌ను ఆదుకునేందుకు త‌న వంతుగా ముందుకు వ‌చ్చి క‌రోనా ఫండ్ ఏర్పాటు చేసి కోట్లాది రూపాయ‌లు వ‌సూలు చేసి ఎంతో మంది పేద సినీ కార్మికుల‌ను ఆదుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే ఈ టైంలో త‌న కుటుంబంతో ఎంజాయ్ చేస్తోన్న చిరంజీవి ఓ ప్ర‌ముఖ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో చేసిన వ్యాఖ్య‌లు మ‌రో స్టార్ హీరో బాల‌కృష్ణ‌కే త‌గిలేలా ఉన్నాయ‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో న‌డుస్తున్నాయి. బాల‌య్య కొద్ది రోజుల ముందు మా బ్లడ్ వేరు.. మా బ్రీడ్ వేరు అని చేసిన వ్యాఖ్య‌లు మెగా ఫ్యామిలీకే అన్న దుమారం రేపాయి.

 

దీనిపై అప్ప‌ట్లో నాగ‌బాబు బాల‌య్య‌ను డైరెక్టుగా టార్గెట్‌గా చేసుకుని ఘాటైన విమ‌ర్శ‌లు చేశారు. ఆ త‌ర్వాత ఎవ‌రికి వారు సైలెంట్ అయ్యారు. ఇప్పుడు చిరంజీవి త‌న తాజా ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ త‌న సోద‌రుల మ‌నస్త‌త్వాల గురించి చెపుతు తాను అమ్మ కూచిన‌ని.. నాగ‌బాబు మాత్రం తండ్రిలా అగ్రెసివ్‌గా ఉంటాడ‌ని.. అలాగని మొత్తం అగ్రెవిస్ కాడు. ఎవరో నన్ను ఏదో అంటే, వాళ్లదే రక్తం, మాది కాదు అన్నట్లు మాట్లాడితే, అప్పుడు గట్టిగా ఇచ్చాడు. ఇవ్వాలి కూడా అని కామెంట్ చేశారు.

 

సో దీనిని బ‌ట్టి చిరంజీవి చేసిన ఈ కామెంట్ మ‌ళ్లీ బాల‌య్య‌ను కెలికి వ‌దిలిన‌ట్టే ఉంద‌న్న చ‌ర్చ‌లు సోష‌ల్ మీడియాలో మొద‌ల‌య్యాయి. ఎప్పుడో జ‌రిగిన అంద‌రూ మ‌ర్చిపోయిన విష‌యాన్ని చిరు ఇప్పుడు ప్ర‌స్తావించ‌డంతో దీనిపై అటు బాల‌య్య అభిమానులు ఎలా స్పందిస్తారు ?  ఇది మ‌ళ్లీ ఎలాంటి సంఘ‌ట‌న‌ల‌కు దారి తీస్తుందో ?  ఎన్ని చ‌ర్చ‌ల‌కు కార‌ణ‌మ‌వుతుందో ?  చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: