దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లో ఉన్న వేళ అక్రమ సంబంధాల గుట్టు రట్టవుతోంది. కొందరు భర్తలు తమ ప్రియురాళ్లతో విరహవేదన తట్టుకోలేక దొరికిపోతుంటే... మరి కొన్ని చోట్ల తమ ప్రియుళ్లు లేకుండా ఉండలేకపోతున్న ప్రియురాళ్లు భర్తలకు దొరికిపోతోన్న సంఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా లాక్డౌన్ వేళ ఓ కిరాకత భార్య తన అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని హత్య చేయించింది. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లాలో జరిగింది. లాక్డౌన్ వేళ భర్త ఇంట్లోనే ఉంటూ తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన ప్రియుడితో కామ కోరికలు తీర్చుకోలేకపోతున్నానని రగిలిపోయిన ఆ భార్య తన ప్రియుడి సహకారంతో భర్తను అడ్డు తొలగించుకుంది.
మెదక్ జిల్లా పాపన్నపేట మండలం అన్నారం గ్రామానికి చెందిన దేవదాసు, పార్వతి భార్యాభర్తలు. ఇద్దరూ ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నారు. దేవదాసు ఫ్రెండ్ సాయిబాబుతో పార్వతి వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి వార్నింగ్ ఇచ్చినా ఆమెలో మార్పు రాలేదు. దీంతో తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయాలని పార్వతి స్కెచ్ వేసింది. సాయిబాబు ముందుగా అనుకున్న స్కెచ్ ప్రకారం కల్లు తాగడం కోసం మరో ప్రాంతానికి దేవదాసును తీసుకెళ్లారు.
అక్కడ దేవదాసు, సాయిబాబుతో పాటు సాయిబాబు స్నేహితులు అందరూ కలిసి బాగా కల్లుతాగారు. ఆ తర్వాత దేవదాసును భయంకరమైన అటవీ ప్రాంతానికి తీసుకు వెళ్లి అక్కడ పీక బిగించి హత్య చేశారు. ముందు ఎవ్వరూ తమకేం తెలియనట్టు ఉన్నా చివరకు పోలీసుల విచారణలో నిజం ఒప్పుకున్నారు. పార్వతి ప్రోద్బలంతోనే ఇదంతా చేశామన్నారు. అందర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు.