విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ప్రమాదం గురించి మంత్రి ధర్మాన కృష్ణదాస్ మీడియాతో మాట్లాడారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు ఐదు గ్రామాల ప్రజలను వెనక్కు పంపించే విషయమై నిర్ణయం తీసుకుంటామని అన్నారు. విశాఖ గ్యాస్ లీకేజ్ పై చంద్రబాబు బురద జల్లడం దారుణమని చెప్పారు. చంద్రబాబు హయాంలో ఎల్జీ పాలిమర్స్ లో ప్రమాదం జరిగిందని... అప్పుడు టీడీపీ ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని అన్నారు. 
 
చంద్రబాబు ప్రభుత్వం ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఇచ్చిందో లేదో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండానే చంద్రబాబు ఫ్యాక్టరీ విస్తరణకు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలని అన్నారు. చంద్రబాబు గతంలో చర్యలు తీసుకుని ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని... చంద్రబాబు తప్పిదాల వల్లే విశాఖ గ్యాస్ లీకేజ్ జరిగిందని అన్నారు. ప్రతిపక్షాలాన్నీ జగన్ ను అభినందించినా చంద్రబాబు మాత్రం రాజకీయాలు చేస్తున్నాడని విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: