తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా చంద్లాపూర్ రంగనాయక సాగర్ జలకళను సంతరించుకుంటోంది. మండు వేసవిలోనూ క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో నిండుకుండలా కనిపిస్తోంది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు రంగనాయకసాగర్కు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. జలకళను సంతరించుకున్న జలాశయ ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొద్దిరోజుల కిందట కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను రంగనాయకసాగర్కు తరలింపు కార్యక్రమాన్ని చేపట్టారు.
అప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలు రంగనాయకసాగర్కు చేరుకుంటున్నాయి. అయితే.. ఎక్కడ కూడా ఎలాంట ఇబ్బందులు తలెత్తకుండా.. నిరంతరంగా గోదావరి జలాలు వచ్చేలా మంత్రి హరీశ్రావు పర్యవేక్షిస్తున్నారు. నిరంతరం అధికారులతో మాట్లాడుతున్నారు. ఈ రంగనాయక సాగర్తో దాదాపుగా లక్షకుపైగా ఎకరాలకు సాగునీరు అందుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జలమట్టం పెరుగుతుండడంతో రైతులు ఆనందపడుతున్నారు.
క్రమంగా పెరుగుతున్న నీటిమట్టంతో కళకళలాడుతున్న రంగనాయకసాగర్ రిజర్వాయర్.#Ranganayaksagar #KaleshwaramProject pic.twitter.com/Yr7TnhE0Y3
— Errolla Prashanth (@ErrollaPrashan2) May 10, 2020