సాధారణంగా ఎవరైనా చనిపోయారన్న వార్త వింటేనే ఎంతో బాధ అనిపిస్తుంది. అలాంటిది చనిపోయిన వ్యక్తి శవం పక్కన ఏకంగా మూడు రోజులు ఉండటం అంటే.. మతిపోవాల్సిందే.  రక్తపు మడుగులో పడి ఉన్న తన భర్త శవం పక్కన ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు రోజులు శవజాగారం చేసింది భార్య.  వివరాల్లోకి వెళితే.. నిజామాబాదు నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో  లింబా రెడ్డి, శకుంతల దంపతులు నివాసం ఉంటున్నారు. అయితే ఈరోజు వారి ఇంటికి పాలు పోయడానికి వచ్చిన వ్యక్తికి తాను భర్తను చంపానని చెప్పింది శకుంతల. ఆ ఇంటి నుంచి దర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.  దీంతో స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఎంతసేపటికి డోర్ తీయకపోవడంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్ళారు. 

 

తీరా లోపలికి వెళ్లిన పోలీసులు షాక్ అయ్యారు.  లింబా రెడ్డి రక్తపు మడుగులో లింబా రెడ్డి మృతదేహం పడి ఉంది. ఆ పక్కనే శకుంతల కూర్చుని ఉంది. అయితే శకుంతల మతిస్థిమితం కోల్పోయి ఉంటుందని ఆమెనే భర్తను చంపి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.  ఆమె మూడు రోజుల క్రితమే తన భర్త చనిపోయి ఉంటాడని.. అందుకే కుళ్లిపోయిన వాసన వస్తుందని అంటున్నారు పోలీసులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు పోలీసులు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: