బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ పాటల రచయిత అన్వర్ సాగర్(70) కోకిలాబెన్ ధీరుభాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. వైద్యులు, కుటుంబ సభ్యులు ఆయన మృతిని ధృవీకరించారు. అయితే అన్వర్ మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. బాలీవుడ్ ప్రముఖులు అన్వర్ మృతి పట్ల సంతాపం తెలియజేశారు.
పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇండియన్ పెర్ఫార్మింగ్ రైట్స్ సొసైటీ లిమిటెడ్ సోషల్ మీడియా వేదికగా ఇలాంటి విషాద సమయంలో అన్వర్ కుటుంబానికి మనోధైర్యాన్ని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నామని పోస్ట్ చేశారు. మూడు దశబ్దాల క్రితం అన్వర్ సాగర్ పాటలు బాలీవుడ్ ప్రజల మెప్పు పొందాయి.