ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ మరో శుభవార్త చెప్పింది. ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా బియ్యాన్ని డోర్ డెలివరీ చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఎన్నికల సమయంలో బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఈ నెల 8న ట్రయల్ రన్ ప్రారంభిస్తున్నారు. ప్రభుత్వం ట్రయల్ రన్ ద్వారా నాణ్యత కలిగిన బియ్యం పంపిణీ , పంపిణీలో పారదర్శకత జరిగేలా చర్యలు చేపడుతోంది. 
 
మొబైల్ వాహనాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే ప్రభుత్వం బియ్యం సరఫరా చేయనుంది. ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్ రాష్ట్ర వ్యాప్తంగా 13,370 మొబైల్ యూనిట్లను అందుబాటులోకి తెచ్చేందుకు టెండర్లను పిలుస్తామని చెప్పారు. లబ్ధిదారుల ముందే బియ్యం బస్తా సీల్ ఓపెన్ చేసి రేషన్ ఇస్తామని... ప్రత్యేకంగా తయారు చేయించిన బ్యాగులను లబ్ధిదారులకు ముందే ఇవ్వనున్నారని తెలిపారు. గ్రామ వాలంటీర్ల ద్వారా బియ్యం పంపిణీ జరగనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: