వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మరోమారు చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు 2019 ఎన్నికల్లో రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లిచ్చాడని అన్నారు. ఎక్కడ గ్యాంగ్ వార్ జరిగినా రక్తపాతం సృష్టించేది బాబు గారి అనుంగు శిష్యులే అని అన్నారు. జగన్ గారి పైనే హత్యాయత్నం చేయించిన చరిత్ర చంద్రబాబుది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
60 ఏళ్ల వృద్ధురాలిపై కేసేమిటని వెనకేసుకొచ్చాడని... రికార్డులు తీస్తే ఆయన హయాంలోనే ఆమె పైన 13 ఎఫ్.ఐ.ఆర్ లు నమోదయ్యాయని తేలిందని చెప్పారు. మరో ట్వీట్లో లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోందని అన్నారు. పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ బయటపడినట్టు అనిపిస్తోందని పేర్కొన్నారు. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని లోకేష్ కుంగిపోతున్నాడు పాపం అంటూ ట్వీట్ చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: